25 December, 2012

కార్తీక సోమవారము - శ్రీకాళహస్తీశ్వర, జ్ఞానప్రసూనంబ దర్శనము.

కార్తీక సోమవారము - శ్రీకాళహస్తీశ్వర, జ్ఞానప్రసూనంబ దర్శనము.


నవంబర్ ఇరవై ఆరున కార్తీక సోమవారము అయింది. శ్రీకాళీహస్తీశ్వర ,జ్ఞానప్రసూనంబల దర్శనార్ధము మేము శ్రీకాళహస్తి ఉదయము ఎనిమిది గంటలకు చేరుకున్నాము. భక్తజనసందోహముతో, శ్రీకాళహస్తి కిటకిటలాడ...ుతోంది. శ్రీస్వామివారిని పవిత్ర కార్తీక సోమవారమునాడు దర్శించుకొనుటకు, భక్తులు బారులుతీర్చి నిల్చున్నారు. పాతాళ గణేశుని దర్శించుటకొరకే దాదాపు ఓ వెయ్యిమంది భక్తులు "క్యూ"లో ఉన్నారు. ఆ గణేశుని బయటనుండే ప్రార్ధించుకుని, శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకొనుటకు "క్యూ" లో నిల్చుని, ఓ రెండుగంటల అనంతరము ప్రధాన ఆలయప్రాంగణములో ప్రవేశించాము. ఆ తరువాత శ్రీశ్రీకాళహస్తీశ్వరుని దర్శనము అనూహ్యముగా ఓ అరగంటలో సంతృప్తిగా జరిగినది.

ఆ ఆలయములో ఉత్సవమూర్తులకు అర్చన గావించుకుని, "సౌవర్ణాంబరదారిణి" అయిన శ్రీజ్ఞానప్రసూనాంబ అమ్మవారిని సేవించుకున్నాము. పిదప శ్రీదక్షిణామూర్తి స్వామివారి చెంత ధర్మపత్ని సమయాభావమువలన "ఆనందలహరి" మాత్రమే పారాయణ చేసుకున్నది. ఆలయ ప్రాంగణములో వివిధదేవతామూర్తులకు వందనములిడి, మొదటిసారిగా సువర్ణముఖి నదిలో జలకళ చూసి పవిత్ర నదీజలాలను శిరస్సున ప్రోక్షణ గావించుకుని, శ్రీసూర్యనారాయణమూర్తికి అర్ఘ్యములిడి, సంతృప్తితో తిరిగి శ్రీనివాసము చేరుకుని సామాను తీసుకుని ఉదయం రిజర్వుచేసుకున్న మన ఆర్టీసీ బస్సులో రాత్రి ఎనిమిది గంటలకు చిదంబరం వైపుగా తరలివెళ్ళాము.

Photo: కార్తీక సోమవారము - శ్రీకాళహస్తీశ్వర, జ్ఞానప్రసూనంబ దర్శనము.
నవంబర్ ఇరవై ఆరున కార్తీక సోమవారము అయింది. శ్రీకాళీహస్తీశ్వర ,జ్ఞానప్రసూనంబల దర్శనార్ధము మేము శ్రీకాళహస్తి ఉదయము ఎనిమిది గంటలకు చేరుకున్నాము. భక్తజనసందోహముతో, శ్రీకాళహస్తి కిటకిటలాడుతోంది. శ్రీస్వామివారిని పవిత్ర కార్తీక సోమవారమునాడు దర్శించుకొనుటకు, భక్తులు బారులుతీర్చి నిల్చున్నారు. పాతాళ గణేశుని దర్శించుటకొరకే దాదాపు ఓ వెయ్యిమంది భక్తులు "క్యూ"లో ఉన్నారు. ఆ గణేశుని బయటనుండే ప్రార్ధించుకుని, శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకొనుటకు "క్యూ" లో నిల్చుని, ఓ రెండుగంటల అనంతరము ప్రధాన ఆలయప్రాంగణములో ప్రవేశించాము. ఆ తరువాత శ్రీశ్రీకాళహస్తీశ్వరుని దర్శనము అనూహ్యముగా ఓ అరగంటలో సంతృప్తిగా జరిగినది. 
ఆ ఆలయములో ఉత్సవమూర్తులకు అర్చన గావించుకుని, "సౌవర్ణాంబరదారిణి" అయిన  శ్రీజ్ఞానప్రసూనాంబ అమ్మవారిని  సేవించుకున్నాము. పిదప శ్రీదక్షిణామూర్తి స్వామివారి చెంత ధర్మపత్ని సమయాభావమువలన "ఆనందలహరి" మాత్రమే పారాయణ చేసుకున్నది.  ఆలయ ప్రాంగణములో వివిధదేవతామూర్తులకు వందనములిడి, మొదటిసారిగా సువర్ణముఖి నదిలో జలకళ చూసి పవిత్ర నదీజలాలను శిరస్సున ప్రోక్షణ గావించుకుని, శ్రీసూర్యనారాయణమూర్తికి అర్ఘ్యములిడి, సంతృప్తితో తిరిగి శ్రీనివాసము చేరుకుని సామాను తీసుకుని ఉదయం రిజర్వుచేసుకున్న మన ఆర్టీసీ బస్సులో రాత్రి ఎనిమిది గంటలకు  చిదంబరం వైపుగా తరలివెళ్ళాము.

No comments:

కీసర వంశము***** KEESARAVAMSAM