03 April, 2013

శ్రీ నాన్నగారి ఆబ్దీకము

శ్రీ నాన్నగారి ఆబ్దీకము ది20-3-2013 ఫాల్గుణ శుద్ధ నవమి బుధవారమునాడు గుంటూరులో ని మారుతీనగర్ చి.పార్ధసారధి స్వగృహం లో శ్రీ ఆదిరాజు పూర్ణచంద్రరావు బావ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది .చి. మూర్తి , చి.రాంబాబు మరదలు శశికుమారి తన కోడలు మనమరాలు ని తీసుకొని వచ్చారు . చి.బిందుకొడుకు సాయి కూడా వచ్చాడు. చి.భాస్కర్ నందిగామనుంది బావగారిని ప్రత్యేకముగా కారు లో తీసుకువచ్చాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా శ్రీ రామచంద్రరావు దంపతులు ఆ కారులోనే వచ్చారు . ఆబ్దీకము తర్వాత రామచంద్రరరావు దంపతులను చి.పార్ధసారధి మనమరాళ్ళు చి. అఖిల చి. నిఖిలలు పూలదండలతో సత్కరించారు . తరవాత చి.పార్ధసారధి, భార్య చి.. ఉమాదేవి కలిసి శ్రీ రామచంద్రరావు దంపతులని నూతన వస్త్రాలతో సత్కరించారు . ఆనాటి సభలో చి. మూర్తి శ్రీ బావగారు , చి. రాంబాబు ముఖ్య అతిధి శ్రీ రామచాద్రరావు లు శ్రీ నాన్నగారి గురించి చక్కగా మాట్లాడారు . అందరు శ్రీ రామచంద్రరావు సేవలు ప్రస్తుతించి, అతను మనలో యొక కుటుంబ సభ్యుడిగా కలిసిపోయడని అతనిని ఈ సందర్భముగా శ్రీ నాన్నగారి తరఫున సత్కరించడం చాల మంచి విషయమని దానికి శ్రీ రామచంద్రరావు అర్హుడని అందరు తమ ఉపన్యాసములలో చెప్పారు .


చి.పార్ధసారధి కుమార్తె చి. సుశీల స్వప్న అల్లుడు మనమరాళ్ళు ఈ కార్యక్రమ నిర్వహణ భాద్యత చేపట్టారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన చాయాచిత్రములు ఇక్కడ చూడండి.








కీసర వంశము***** KEESARAVAMSAM