20 June, 2013

చి. నాగశ్రీవల్లి జన్మదినము





ఈ రోజు మా ప్రధమ పుత్రవధు (కోడలు) చి. నాగశ్రీవల్లి జన్మదినము. కంప్యూటర్ సైన్సు లో మాస్టర్సు చేసిన ఈమె పూనా లో ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో టీమ్ లీడర్ గా ఉద్యోగము చేస్తున్నది. కీసర వంశ పెద్దలందరూ ఈమెకు దీవెనలు అందచేస్తున్నారు. దీర్ఘసుమంగళీ భవ ! ఆయురారోగ్య ప్రాప్తిరస్తూ !!
పుత్రపౌత్రాభివృద్ధిరస్తూ!! అష్టైశ్వర్యాభివృద్ధిరస్తూ !!


                                                                                                  

05 June, 2013

చి . జగదీశ్వరి జన్మ దినము


    ఈ  రోజు  మీ మోడరేటర్  ధర్మపత్ని చి . జగదీశ్వరి జన్మ దినము. 

    ఆమెకు కీసర వంశజుల  ఆశ్సిసులు , శుభాకాంక్షలు .

01 June, 2013

HAPPY BIRTH DAY TO CHY.VAMSIKRISHNA S/O SHRI VEDADRI AND SMT.KATYAYANI


  TO-DAY IS THE BIRTH DAY OF CHY.VAMSI KRISHNA

 KEESARAVAMSTASTULU WISH CHY.VAMSI KRISHNA ,S/O SHRI VEDADRI ANNAIAH

AND SMT.KATYAYINI VADINA A VERY HAPPY BIRTHDAY.


                                    ఓం శతమానం భవతి శతాయ్యుప్పురుష


                                    శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్థతి

28 May, 2013

చి.స్వర్ణమంజరి మూడవ పుట్టినరోజు



చి.సునీల్ కుమార్, చి.స్వప్నసుందరీల ద్వితీయ పుత్రిక చి.స్వర్ణమంజరి మూడవ పుట్టినరోజు హైదరాబాద్ లో జరుపుకుంటున్నది. కీసరవంశస్థులందరూ చి.స్వర్ణమంజరిని ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిగాను, చిరాయువుగాను, సకలకళాభివృద్ధిగాను ఆశీర్వదిస్తున్నారు.

                                                          

08 May, 2013

చిరంజీవి సునీల్ కుమార్ పుట్టినరోజు శుభాకాంక్షలు

                                       చిరంజీవి సునీల్ కుమార్ పుట్టినరోజు శుభాకాంక్షలు


                                         

ఈరోజు న్యుఢిల్లీ లో పుట్టినరోజు జరుపుకుంటున్న చి.సునీల్ కుమార్ కు కీసర వంశస్థులందరు  శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఓం శతమానం భవతి శతాయ్యుప్పురుష


                                                    శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్థతి

                                        

                                           

06 May, 2013

చిరంజీవి సౌందర్య లహరి పుట్టినరోజు


చిరంజీవి సౌందర్య లహరి పుట్టినరోజు ది. 05. 05. 2011 న  ఇంద్రప్రస్త లో అతి వైభవముగా జరిగినది.

        చిరంజీవిని తాత గారు సాయి , నాయనమ్మ జగదీశ్వరి ఉదయమే హారతి ఇచ్చి దీవెనలు పలికారు. తల్లి
తండ్రులు చి. సునీల్ కుమార్ చి.స్వప్న సుందరి ఆశ్శీ సులు ఇచ్చి మంగళ స్నానములు చేయించి నూతన వస్త్రములు   ధరింపచేశారు. చిరంజీవి సౌందర్య లహరి పెద్దలందరికీ పాదాభివందనము చెసింది చిరంజీవి స్వర్ణ మంజరి ఈ వేడుకలలో ఉత్సాహముగా పాల్గొంది. వివిధ ప్రాంతముల నుండి బంధుమిత్రులు చిరంజీవి సౌందర్య లహరికి ఫోన్లలో ఆశ్శీశులు అందచేశారు. సాయంకాలము యాభై మంది పిల్లల మద్య సౌందర్య లహరి పుట్టిన రోజు " కేకు" కట్  చేసి స్నేహితులతో నృత్యగాన విభావరిలో పాల్గొని కన్నుల విందు  ఛేసినది.

                                                          

04 May, 2013

చిరంజీవి స్వప్న సుందరికి పుట్టిన రోజు శుభాకాంక్షలు


చిరంజీవి స్వప్న సుందరికి పుట్టిన రోజు శుభాకాంక్షలు

   ఈ  రోజు జన్మదినము జరుపుకుంటున్న మా ద్వితీయ స్నుష (కోడలు) కు, కీసర వంశస్తులందరు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

                         


26 April, 2013

మా మాతృమూర్తి ఆబ్దీకము - చైత్రబహుళ పాడ్యమి (26.04.2013)


బ్రహ్మశ్రీ భీమసేన భట్టు గారి ఆధ్వర్యమున, మిత్రులు శ్రీ పరిటాల గోపీకృష్ణ గారి సమక్షములో మా మాతృమూర్తి ఆబ్దీకము వేదోక్తముగా జరిగినది.  

20 April, 2013

చి.హర్షిత, చి.ద్రితి

చి.చైతన్య, చి.సౌమ్యల ముద్దుబిడ్డలు విజయ నామ సంవత్సర ఉగాది పండుగ రోజున చి.హర్షిత, చి.ద్రితి

17 April, 2013

చి. శ్రీకాంత్ భరద్వాజ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు


"   చి. శ్రీకాంత్ భరద్వాజ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు "

        చి.పార్ధసారధి, చి.ఉమాదేవి సుపుత్రుడు చి. శ్రీకాంత్ భరద్వాజ్. 



            

       గుంటూరులో ఈ రోజు అనగా ది. 17వ ఏప్రియల్  2013 న    పుట్టినరోజు జరుపుకుంటున్న చి. శ్రీకాంత్ భరద్వాజ కు కీసర వంశస్తులందరూ శుభకాంక్షలు  తెలుపుతున్నారు.



     

03 April, 2013

శ్రీ నాన్నగారి ఆబ్దీకము

శ్రీ నాన్నగారి ఆబ్దీకము ది20-3-2013 ఫాల్గుణ శుద్ధ నవమి బుధవారమునాడు గుంటూరులో ని మారుతీనగర్ చి.పార్ధసారధి స్వగృహం లో శ్రీ ఆదిరాజు పూర్ణచంద్రరావు బావ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది .చి. మూర్తి , చి.రాంబాబు మరదలు శశికుమారి తన కోడలు మనమరాలు ని తీసుకొని వచ్చారు . చి.బిందుకొడుకు సాయి కూడా వచ్చాడు. చి.భాస్కర్ నందిగామనుంది బావగారిని ప్రత్యేకముగా కారు లో తీసుకువచ్చాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా శ్రీ రామచంద్రరావు దంపతులు ఆ కారులోనే వచ్చారు . ఆబ్దీకము తర్వాత రామచంద్రరరావు దంపతులను చి.పార్ధసారధి మనమరాళ్ళు చి. అఖిల చి. నిఖిలలు పూలదండలతో సత్కరించారు . తరవాత చి.పార్ధసారధి, భార్య చి.. ఉమాదేవి కలిసి శ్రీ రామచంద్రరావు దంపతులని నూతన వస్త్రాలతో సత్కరించారు . ఆనాటి సభలో చి. మూర్తి శ్రీ బావగారు , చి. రాంబాబు ముఖ్య అతిధి శ్రీ రామచాద్రరావు లు శ్రీ నాన్నగారి గురించి చక్కగా మాట్లాడారు . అందరు శ్రీ రామచంద్రరావు సేవలు ప్రస్తుతించి, అతను మనలో యొక కుటుంబ సభ్యుడిగా కలిసిపోయడని అతనిని ఈ సందర్భముగా శ్రీ నాన్నగారి తరఫున సత్కరించడం చాల మంచి విషయమని దానికి శ్రీ రామచంద్రరావు అర్హుడని అందరు తమ ఉపన్యాసములలో చెప్పారు .


చి.పార్ధసారధి కుమార్తె చి. సుశీల స్వప్న అల్లుడు మనమరాళ్ళు ఈ కార్యక్రమ నిర్వహణ భాద్యత చేపట్టారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన చాయాచిత్రములు ఇక్కడ చూడండి.








26 March, 2013

కాశీ, గయా యాత్రలు - నందన ఫాల్గుణం - మార్చి 2013

కాశీ, గయా యాత్రలు - నందన ఫాల్గుణం - మార్చి 2013


నేను, నా ధర్మపత్ని చి.జగదీశ్వరి 18 వ మార్చిన బయలుదేరి మరునాడు ఉదయము కాశీ చేరుకున్నాము. బస జయపూరియ హోటల్. అసి, కేదార్ ఘాట్, దశాశ్వమేధ ఘాట్, పంచగంగా ఘాట్, లలో పుణ్యస్నానములు ఆచరించి, సరిగ్గా అపర్నాహము అగుసరికి మణికర్ణికా ఘాట్ లో రామేశ్వరము నుండి తెచ్చిన జలములతో సహా సైకతలింగమునకు అర్చన చేసుకొని, సైకతలింగము సమంత్రకముగా పవిత్ర గంగాజలములలో నిమజ్జనము గావించాము.

తదుపరి శ్రీకాశీవిశ్వనాధుని దర్శనము చేసుకుని శ్రీస్వామికి క్షీరాభిషేకముతో అర్చన చేసుకున్నాము.

కాశీఅన్నపూర్ణను సేవించుకుని, సాక్షిగణపతి స్వామికి కైమోడ్పులొనరించి., బస చేరుకుని సాయంకాలము గయ ప్రయాణము అయ్యాము.

ఫాల్గుణ శుద్ధనవమి - మా నాన్నగారి తిధి

గయ మేము బుధవారము ఫాల్గుణశుద్ధనవమి 20 వ మార్చి తెల్లవారుఝామున మూడుగంటలకు చేరుకున్నాము. ముందు అనుకున్నప్రకారము స్థానిక తెలుగు పురోహితులు శ్రీఅరుణాచారి గారు తమ మనిషిని రైల్వేస్టేషన్ కి పంపారు. అతని సహాయముతో మేము బసకు చేరుకుని రెండుగంటలు విశ్రాంతి తీసుకుని, తరువాత సంధ్యాదులు ముగించి, అపర్ణాహ వేళకు మాకు నిర్ణయించబడిన గదిలో ఆరోజు కీ.శే.మానాన్నగారి తిధి అగుటచేత, వారికి శ్రాద్ధకర్మ నిర్వహణకు ఉపక్రమించాను. ఆ యజ్ఞము శ్రీకుప్పా ఆంజనేయ శర్మ గారు నిర్వహించారు. అగ్నిహోత్రము, భొక్తలు, నాలుగు కూరలు, నాలుగు పచ్చడులు, నాలుగు పిండివంటలు, భోక్తలకు సన్మానమునకు ధోవతులు, అంగవస్త్రములు, రాగిచెంబు, హరివేణము, పంచపాత్ర, ఉద్ధరిణ, ఋత్విజునకు సన్మానమునకు విడిగా వస్తుసామాగ్రి నిమిత్తము దక్షిణతాంబూలాదులతో శ్రాద్ధకర్మ సమంత్రకముగా యధావిధిగా నిర్వహించి శ్రీనాన్నగారికి నేను చేయవలసిన ఈ యజ్ఞకర్మ నిర్వహించి సంతుష్టిచెందినాను. ఈ యజ్ఞకర్మకు నా ధర్మపత్ని తనవంతు కార్యము నిర్వహించినది. పార్వణములు పవిత్ర విష్ణుపాదముల వద్ద తాడనము చేసి పాదములకు అర్పణము మరొక ముఖ్య కార్యక్రమము. దాదాపు రెండున్నర గంటలు పట్టిన ఈ శ్రాద్ధకర్మ అనంతరము పితృదేవతల ప్రసాదము స్వీకరించి విశ్రాంతి తీసుకున్నాము.





అష్టాదశ శక్తి పీఠము - మాంగల్య గౌరి దర్శనము - గయ

సాయంకాలము అష్టాదశ శక్తి పీఠములలో ఒకటైన మాంగల్య గౌరి దర్శనము చేసుకున్నాము. ఈ మాత ఆలయము చాలా ప్రశస్తమైనది.

చిన్న ఆలయమైన చాలా మహిమాన్వితమైనదిగా భారతదేశములో ప్రసిద్ధి చెందినది. అమ్మ గర్బాలయము ప్రవేశము చాలా ఇరుకుగా ఉన్నది. గర్భాలయములో ముగ్గురు నలుగురుకు మాత్రమే కూర్చొను స్థలము కలదు. మళ్ళీ ఆ సన్నటి ప్రవేశద్వారము ద్వారా నిర్గమనము వయసుమీరిన వారికి కొద్ది శ్రమగా ఉండగలదు. ప్రక్కనే దుర్గామాత ఆలయము దర్శనము చేసుకొని బసకు తిరిగివచ్చాము.

పితృదేవతలకు "గయాశ్రాద్ధము"

మరుసటి దినము యధావిధిగా పితృదేవతలకు గయాశ్రాద్ధము నిర్వహించడమైనది. ఇది ప్రతి గృహస్తు విధిగా నిర్వహించవలసిన కార్యక్రమము. గయలో పితృదేవతలకు అంటే పితామహుల, మాతామహుల వైపున గతించిన బంధువులకు, స్నేహితులకు, గురువులకు పిండప్రదానము చేసి మనవంతు ధర్మము నిర్వహించుట ప్రధాన ఉద్దేశ్యము. ఇది గయలో చాలమంది తెలుగువారు నిర్వర్తించడము చాలా ముదావహం. ఈ కార్యక్రమము యావత్తూ "విష్ణుపాదముల" ఆలయప్రాంగణములో జరిగినది. మూడు విశాలపత్రములలో ఒక్కొక్క పత్రములో ముప్పైరెండు చొప్పున మొత్తం తొంభైయ్యారు పిండములు తయారు చేసి, సమంత్రకముగా పితృదేవతలకు పిండప్రదానము చేసి, ఆ పార్వణములు విష్ణుపాదములవద్ద అర్పణగావించి, తిరిగి ముప్పై రెండు పార్వణములు గోమాతకు అర్పణముచేసి, చివరి ముప్పైరెండు పార్వణములు పవిత్ర అక్షయవటవృక్షమునకు అర్పించి కృతార్ధుడయ్యాను.






తదుపరి కర్త, అతని ధర్మపత్ని మూడువిధిగా త్యజించవలసినవి త్యజించాము. ( ఓఆకు, ఓకూర, ఓ పండు త్యజించవలసినవి.) అసలు త్యజించవలసినవి అరిషడ్వర్గములు అని పెద్దలు చెబుతారు. సామాన్యులకు అది సాధ్యం కాదు కాబట్టి, ఇష్టమైనవి త్యజించడము అలవాటు చేసుకోవాలి అని భావన.

తిరిగి బసకు చేరుకుని బుద్ధగయ చారిత్రాత్మకము కాబట్టి అది కూడా దర్శనీయ స్థలములో భాగముగా చూచివచ్చాము.






మరునాడు తెల్లవారు ఝామున కాశీప్రయాణమై, మూడురోజులు కాశీవాసము చేసి, శ్రీవిశ్వనాధుణ్ణి, హొలీపున్నమి ముందువచ్చే ఏకాదశిసాయంసమయమున భక్తులు శ్రీస్వామి వారికి రంగులు అర్పించడము ఆనవాయితీ. శ్రీస్వామి దర్శనార్ధము వెళ్ళిన ఇది మాకు అనుకోకుండా కలిగిన మహాధ్భాగ్యము. శ్రీస్వామివారిని అత్యంత రంగురంగులతో అలంకరించి భక్తులకు కనువిందు గావించారు. అమ్మవిశాలాక్షిని, కేదారేశ్వరుణ్ణి, లోలార్కకుండ ఆదిత్యులను, శంకరమఠస్వాములను , ఇతర ఆలయములు దర్శించుకుని ఇంద్రప్రస్త తిరుగుప్రయాణము అయ్యాము. మా కాశీ, గయ తీర్ధయాత్రలు ఈ విధంగా సుసంపన్నము అయినవి. స్వస్తి.

మరిన్ని ఛాయాచిత్రములకు క్రింది లంకె నొక్కండి.

https://plus.google.com/u/0/photos?tab=Xq#photos/105802903792469439891/albums/5859561756970103873



08 March, 2013

చిరంజీవి భరద్వాజ్ కుమార్, చిరంజీవి నాగశ్రీవల్లీ పన్నెండవ వివాహ వార్షికోత్సవము



  చిరంజీవి భరద్వాజ్ కుమార్, చిరంజీవి  నాగశ్రీవల్లీ   ఈ రోజు అనగా ది. 8 వ మార్చి న పూనా నగరం లో   తమ పన్నెండవ  వివాహ వార్షికోత్సవము జరుపుకుంటున్నారు.  వారిద్దరికీ కీసర వంశస్థులందరు శుభాకాంక్షలు  అందచేస్తున్నారు .


                                                                    

06 March, 2013

పవిత్ర మహాకుంభమేళా - నందన మాఘము 2013

పవిత్ర మహాకుంభమేళా సందర్భమున నేను త్రివేణి సంగమమున ప్రితృదేవతలకు
యధావిధిగా కర్మలను ఆచరించి వచ్చాను. ఈ యజ్ఞములో నా ధర్మపత్ని జగదీశ్వరి తనవంతు ధర్మములు నెరవేర్చటముతో పాటు, "వేణీదానము" కూడా చేసి కార్యక్రమము సుసంపన్నము చేసినది. ఈ కార్యక్రమము యావత్తు శ్రీ మనోహర్ శాస్త్రి పురాణిక్ గారి ఆధ్వర్యములో జరిగినది. వారు ఈ మహాకుంభమేళా స్నానము, తదుపరి కార్యక్రమములకు పితృదేవతల ఆశ్శీసులతో పాటు భగవంతుని అనుగ్రహము ఉండవలెనని తమ ఆశ్శీపూర్వకవాచకములో చెప్పారు.

ఈ యాత్రలో భాగంగా అష్టాదశపీఠములలో ఒకటైన "శ్రీమాధవేశ్వరీమాత" "ఆలోపీ మహేశ్వరీ" పీఠదర్శనము, మహావటవృక్షము, హనుమాన్ దేవాలయము, శంకరవిమాన మండపము, భారద్వాజ ఆశ్రమము చూడటం మా భాగ్యంగా తలుస్తున్నాము.

దీనికి సంబంధించిన ఛాయాచిత్రములు చూచుటకు ఈ లంకె నొక్కండి.

https://plus.google.com/photos/105802903792469439891/albums/5852153727535228145?authkey=CLq9__WQxMSN1gE#photos/105802903792469439891/albums/5852153727535228145

శ్రీకృష్ణార్పమస్తు.

వేణీదానము

మా త్రివేణీ సంగమ (ప్రయాగ) యాత్రలో చిరంజీవి    జగదీశ్వరి  "వేణీదానము" చేసినది.


దానిలో భాగంగా పతి ధర్మపత్నికి దానమునకు ముందు "వేణి" కూర్చుతున్న దృశ్యము.



                  

26 February, 2013

చిరంజీవి సునీల్ కుమార్


 ప్రస్తుతము పనిచేస్తున్న కంపెనీలో సమర్దవంతముగా ఒక దశాబ్ధము పూర్తిచేసిన సందర్భముగా చిరంజీవి సునీల్ కుమార్ ను అధికారులు ట్రోఫీలతో, సర్టిఫికేట్ లతో  సత్కరించారు.  ఆ పురస్కారములు మన ఆనందము కోసము ఇక్కడ పొందుపరుస్తున్నాము.




      

చిరంజీవి హర్షిత ఇటీవలి ఛాయా చిత్రములు


చిరంజీవి హర్షిత, చి.చైతన్య - చి.సౌమ్య ల జ్యేష్ట పుత్రిక  ఇటీవలి ఛాయా చిత్రములు చి.చైతన్య పంపిచాడు  .

      ఆ ఫోటోలు మన ఆనందం కోసము పొందుపరుస్తున్నాము.


కీసర వంశము***** KEESARAVAMSAM