19 June, 2012

చి.చైతన్య "స్టార్ ఫర్ ఫార్మర్" (STAR PERFORMER) 2011-12





                                                                                                                   

            


           చి.చైతన్య "స్టార్ ఫర్ ఫార్మర్" (STAR PERFORMER) 2011-12




                 చి. చైతన్య తను పనిచేసే కొయ్ సెరా కంపెనీలో 2011-12 సంవత్సరమునకు

                                                 "స్టార్ ఫర్ ఫార్మర్" గా

                                                      నిలిచాడు.

       ఈ ప్రతిభావంతమైన పనిపాటవమునకు "కొయ్ సెరా" కంపెనీవారు చి.చైతన్యను జూన్ 13, 2012 న

       సింగపూర్ లో జరిగిన సమావేశములో సన్మానించారు.

కీసరవంశస్థులందరు మనవంశము పేరు-ప్రతిష్టలు ఖండాతరములలో వ్యాప్తి చేస్తున్న చి.చైతన్యను అభినందిస్తున్నాము. కంపెనీ వారిచ్చిన సర్టిఫికెట్ ఇక్కడ పొందుపరచడమైనది.




                                                                                                                


                                                                                                         

10 June, 2012

గీతశ్లోకము పఠిస్తున్న చి.హర్షితకు ఆశ్శీసులతో కూడిన జేజేలు.

చి.చైతన్య,చి.సౌమ్యల ముద్దుపెద్దపాప చి.హర్షిత వేసవి సెలవలు వృధాకానివ్వకుండా ఓ వేసవి విడిదిలో పాల్గొని తన భావాలకు మెరుగు దిద్దుకుంది. ఈ చిరంజీవి ఆ విడిది ముంగింపునందు గీతశ్లోకము పఠిస్తున్న చాయచిత్రమిది. చి.హర్షితకు ఆశ్శీసులతో కూడిన జేజేలు.

                                                                

02 June, 2012

కీసర వంశము - KEESARA VAMSAM: దండం దశ గుణం భవేత్

కీసర వంశము - KEESARA VAMSAM:SPECIAL POSTS

దండం దశ గుణం భవేత్

దండం దశ గుణం భవేత్ అనే మాట తరుచుగా వింటూ ఉంటాం కదా?
దాని పూర్తి పాఠం చూదాం ...

విశ్వా మిత్రా హి పశుషు, కర్దమేషు జలేషుచ
అంధే తమసి వార్ధక్యే, దండం దశ గుణం భవేత్.

వి = పక్షులు
శ్వా = కుక్కలు
అమిత్ర = శత్రువులు
అహి = పాములు
పశు = పశువులు ( వీటిని అదుపు చేయడానికిన్నీ)

కర్దమేషు = బురదలో
జలేషుచ = నీటిలో
అంధే = గుడ్డితనంలో
తమసి = చీకటిలో
వార్ధక్యే = ముసలితనంలో ( సాయంగా ఉండేది కర్ర.)
( ఈ విధంగా)

దండం = కర్ర
దశగుణమ్ = పది విధాలయిన
గుణమ్ = గుణములు కలది
భవేత్ = అగుచున్నది.

అంటే, చేతి కర్ర పక్షులను, కుక్కలను, శత్రువులను, పాములను, పశువులను అదుపులో ఉంచడానికి ఉపయోగ పడుతుంది.

అంతే కాక, బురదలో సజావుగా నడవడానికి, నీటిలో లోతు చూసుకుంటూ దిగడానికీ, చీకటిలో తడుముకుంటూ క్షేమంగా వెళ్ళడానికీ, గుడ్డితనంలో ఆసరాగానూ, ముసలితనంలో ఊతగానూ ఉపయోగపడుతుంది.

ఈ విధంగా చేతి కర్ర పదిరకాలుగా మనకు ఉపయోగ పడుతున్నదన్నమాట.

శ్లోకం అర్ధం ఇలా ఉంటే, మనలో చాలమంది ఎందుకో, దండించడం వల్ల ( శిక్షించడం వల్ల) పదిలాభాలు ఉన్నాయి .. వంటి అర్ధాలు చెబుతూ ఉంటారు. దండం అనే పదాన్ని దండన అనుకోవడం వలన ఈ భావం కలుగుతూ ఉండొచ్చును.

28 May, 2012

ఈరోజు రెండవ పుట్టినరోజు జరుపుకుంటున్న చి!! యశస్విని స్వర్ణమంజరి కి సాయితాతయ్య, జగదీశ్వరి నానమ్మ, భరద్వాజ్ కుమార్ పెద్దనాన్న, నాగశ్రీవల్లి ఆమ్మ (దొడ్డమ్మ), మహాన్యాస్ అన్నయ్య, సహిష్ణు అన్నయ్య,అత్యంత ప్రేమతో శుభాశ్శీసులు అందిస్తూ,
   

                                       "ఓం శతమానం భవతి శతాయ్యుప్పురుష

                                        సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్థతి"

                                      అని ఆశీర్వదిస్తూ, ముద్దులు అందిస్తున్నాము.




















26 May, 2012

చి!సౌందర్యలహరి, చి!స్వర్ణమంజరిల పుట్టినరోజు మహోత్సవాహ్వానము

                         చి!సౌందర్యలహరి, చి!స్వర్ణమంజరిల పుట్టినరోజు మహోత్సవాహ్వానము

24 May, 2012

దైవము - లీలలు

మనము చేసే పాపపుణ్యాలను బట్టీ దైవము


ఫలితాలనిస్తుంది అని మన సనాతన ధర్మం బోధిస్తోంది. వివరంగా చెప్పాలంటే,

మనం చేసే పాపపుణ్యాలు మూడు విభాగాలుగా ఉంటాయి.

ఒకటి. అతిసామాన్య పుణ్యము అతిసామాన్య పాపము. .

రెండు. సామాన్య పుణ్యము. సామాన్య పాపము.

మూడు. అనన్య సామాన్య పుణ్యము. అతి ఘోర పాపము.



దైవము అతిసామాన్య పుణ్యములను, అతిసామాన్య పాపములను, కలలో అనుభవించేవిధముగా చేస్తుంది.

ఉదాహరణకు మనం బిక్షాటనకు వచ్చేవానికి దానం చేయలనుకుని జేబులో చెయ్యిపెట్టుకుంటే,

మనం అనుకున్న పైకం, జేబులో సమయానికి లేకపోతుంది. మనం మనస్సులో నొచ్చుకుంటాము.

ఈలోపల మన ఎక్కవలసిన బస్సు వచ్చేస్తుంది. మనం దానం చేయకుండానే ఇంటికి వెళ్ళిపోతాము.దానం చేయాలనే భావన రావడం కూడా ఒకరకమైన పుణ్యమే. కాని దానం చేయలేదు కాబట్టి ఇది అతిసామాన్య పుణ్యఖాతాలోనికి వెళుతుందన్నమాట.

ఇలాంటిఅతిసామాన్య పుణ్యాలను మనము కలలో " ఏదో పదోన్నతి పొందినట్లో" అనుభవింపచేస్తుంది. అలాగే అతిసామాన్య పాపములు.



ఇఖ అనన్య సామాన్య పుణ్యములను, అతి ఘోరపాపములను ఈ జన్మలోనే అనుభవించేటట్లు చేస్తుంది.

మనం ఎదో పెద్దయాగము చేశామనుకోండి, దైవము ఆ ఫలితము ఈజన్మలోనే అనుభవింపచేస్తుంది. అలాగే అతి ఘోరపాపములు చేసేవారు కూడా ఈ జన్మలోనే దాని ఫలితము అనుభవించేటట్లు చేస్తుంది. సంఘములో అవినీతికి పాల్పడినవారిని ప్రభుత్వము, శాసనము శిక్షించడము ఈ కోవలోనికే వస్తుంది.

ఇఖ సామాన్య పుణ్యపాపములను దైవము ముందు జన్మలలో అనుభవింపచేస్తుంది.

ఈ సామాన్య పుణ్యఫలితము దైవం ప్రకృతి భీభస్తమములలో మీ పుణ్యఫలితమును ఉపయోగించి సృష్టిని కాపాడి మీ పుణ్యమును అనేక రెట్లు పెంచి మీకు కావలసిన సమయములో ఆ పుణ్య ఫలితమును అందిస్తుంది.



అదేవిధముగ మనము చేసే పాపములను అనుభవించటానికి వలసిన ఓర్పును నేర్పును మనకు కాలక్రమేణా అందేటట్లు చేస్తుంది.

కాబట్టి దైవలీలలను మనము ఓర్పుతో అర్ధము చేసుకుని, సహనము వహించి, దైవభక్తితో ఉండటము అలవాటు చేసుకోవాలి. దైవమును దూషించరాదు.

శ్రీరామాయణములో రాముని పట్టాభిషేకము రేపు అనగా, రాత్రికి రాత్రి ఘట్టములు సంభవించి శ్రీరాముడు అడవులకు వెళ్ళే పరిస్థితి దాపురిస్తే, లక్ష్మణస్వామి చలించిపోయి "అన్నయ్యా! నాకు అనుమతినిస్తే తండ్రిని ఎదిరించి, నీకు పట్టాభిషేకము చేస్తా! ఏమిటి! దైవము, దైవము అంటావు?" అని దైవదూషణకు దిగుతాడు. అప్పుడు శ్రీరాముడు ఎంతో ఓర్పుతో "లక్ష్మణా! దైవము నీకు కనబడితేకదా? నువ్వు దైవాన్ని ఎమైనా చేశేది?" అని వారించి లక్ష్మణస్వామిని దైవదూషణా పాపాన్నించి తప్పించి అడవులకు పయనమవుతాడు.

ఇక్కడ గమనించాల్సింది," కనపడని దైవాన్ని నిందించి ప్రయోజనము లేదు,దైవశాసనాన్ని పాలించడమే మానవకర్తవ్యం" అనే శ్రీరామవాక్యాన్ని.

కాబట్టి మనమందరం సదా మన మనస్సనే రాగి చెంబును మలినం కాకుండా భక్తి అనే చింతపండుతో ఎల్లప్పుడూ తోముతూ, నిరంతరము దైవచింతనతో ఉంటే మనస్సు నిర్మలంగా ఉండి, జీవితంలో కలిగే ఆటుపోటులకు కృంగిపోకుండా సాగిపోయేటట్లు,

చేసుకోవాలి. దానికి పూర్తిశరణాగతి ఒక్కటే మార్గము. భగవంతుని పాదములు మనస్సులో తలచుకుని, ఆయన పాదములు

పట్టుకుని, " నేను నీశరణాగతుడను, నీపాదములు పట్టి ప్రార్ధిస్తున్నాను. జన్మజన్మలలో నేను చేసిన పాపములు మన్నించి, నన్నురక్షించు, తండ్రీ," అను ఆర్తితో ప్రార్ధించండి. ఆ ప్రార్ధనకు భగవంతుడు కరిగిపోయి, మీకు వెంటనే కావలిసినవన్నీ సమకూరుస్తాడు.



స్వస్తి.












15 May, 2012

శ్రీవేదాద్రి అన్నయ్య శ్రీమతి కాత్యాయని వదిన 42వ వివాహ వార్షికోత్సవము

శ్రీవేదాద్రి అన్నయ్య శ్రీమతి కాత్యాయని వదిన 42వ వివాహ వార్షికోత్సవము సందర్భమున వారిద్దరి పాదములకు


నమస్కరిస్తూ కీసర వంశస్థులందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాము.










వారి అన్యోన్య దాంపత్యము కలకాలము వర్ధిల్లాలని ఏడుకొండల శ్రీవేంకటేశ్వరుని ప్రార్ధిస్తూన్నాము.



08 May, 2012

చి! సునీల్ కుమార్ పుట్టిన రోజు

ఈరోజు అనగా ది.8.05.2012 ఢిల్లీలో నా ద్వితీయ కుమారుడు చి! సునీల్ కుమార్ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు.
                                        


కీసర వంశజుల తరఫున చి! సునీల్ కుమార్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందచేస్తున్నాము.
 
                         http://telugugreetings.net/cgi-bin/pd/pd.cgi?object=/pd/postcards/birthday/large/abhinandanalu.swf&form=form-flash.txt
 
 
 

06 May, 2012

చి! లక్ష్మీనరసింహమూర్తి షష్ట్యబ్ధి పూర్తి మహోత్సవ విశేషములు

చి! లక్ష్మీనరసింహమూర్తి షష్టిపూర్తి వేడుకలు దమ్మాయిగూడాలోని భరద్వాజ్ నిలయంలో ది.22.04.2012 నుండి ది.24.12.2012 వరకు ఘనంగా జరిగాయి.


వేదోక్తమయిన ఈ పవిత్ర కార్యక్రమ నిర్వహణ యావత్తూ బ్రహ్మశ్రీ వేలమూరి దత్తాత్రేయశర్మగారు అత్యంత భక్తి శ్రద్ధలతో పలువురు వేదవిద్వాంసుల సహకారముతో వైభవంగా నిర్వహించారు.

మొదటిరోజు మృత్తికాస్నానానంతరము మహామంటపారాధనము వేదోక్తమంత్రములతో కలశస్తాపనలతో రంగవల్లికలతో కడు రమ్యంగా సాగినది.

మహాగణపతి పూజానంతరము, రెండవరోజు ఆయుష్యహోమము, సూర్యనమస్కారప్రక్రియ యంత్రసహితముగా జరినవి. తదుపరి ఉగ్రరధశాంతిహోమములు ఋత్విక్కులు సశాస్త్రీయముగా జరిపించి, మహావైభవముగా సహస్రలింగాభిషేకము చేశారు. చి!లక్ష్మీనరసింహమూర్తి, ధర్మపత్ని చి!భారతి ఈ వైదికప్రక్రియలన్నిటినీ మహశ్రద్ధగా చేశి, వంశాభివృద్ధికొరకు అనేక దానములు బ్రహ్మణప్రముఖలకు నిర్వహించారు.

మూడవరోజు చి!చైతన్య, చి!ప్రశాంత్ దంపతులు తల్లిదండ్రులకు పాదపూజ చేసి కృతార్ధులయ్యారు.

తదనంతరము వైదికముగా పుర్ణాహుతి జరిగినది. దంపతులకు కీసర ఆడపడచులు మంగళహారతిచ్చి, వేడుకలకు స్వస్తి పలికారు.

ఈవేడుకలకు పెద్దఎత్తున బంధుమిత్రులు హాజరయి చి.మూర్తిదంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

చి.మూర్తి దంపతులు పెద్దలకు పిన్నలకు నూతనవస్త్రములందించి, షడ్రసోపేతమైన విందుభోజనములతో వారినందరిని ఆనందపరిచారు.

ఈ వేడుకలకు సంబంధించిన వేలకొలది చాయచిత్రములు మాకందినవి. వాటినన్నిటిన్నీ వీక్షీంచుటకు

ఈ లంకెను నొక్కండి.

http://www4.snapfish.in/snapfishin/thumbnailshare/AlbumID=4230078024/a=4060870018_1571475024/


సాయంత్రం జరిగిన "మేజువాణి" లో చి!జ్యోత్స్న, చి!జ్యోతి, మధురమైన అన్నమయ్య సంకీర్తనలు


శ్రావ్యంగా ఆలపించి ఆహుతులనలరించారు. తదుపరి షష్ట్యబ్ధి దంపతులు మనుమరాళ్ళ సహాయంతో 60వ సంవత్సరపు పుట్టినరోజు కేకును కట్ చేయగా అన్నదమ్ములు, చెల్లెళ్ళు, బంధుమిత్రులు "HAPPY BIRTH DAY" గీతాన్ని ఆలపించారు. పిల్లలు కేకును అందరికీ పంచగా అందరి నోళ్ళు మళ్ళీ ఆరోజు సాయంకాల వాతావరణంలా మధురధరహాసాలతో గుబాళించాయి.

ఆ కేకు కోస్తున్న సంబరం ఇక్కడ చూడండి.





మిగిలిన అన్ని వీడియోలు దాదాపు ఓ యాభై  యూట్యూబులోనికి పంపడమైనది.

ఆవీడియోలను వీక్షించటానికి ఈ క్రింద ఇవ్వబడిన లంకెలను ఉపయోగించండి.

http://www.youtube.com/playlist?list=PL8FA212C8F342A141

శ్రీసాయిఅన్నయ్య డిజిటల్ కెమేరా నుండి తీసిన 110 చాయచిత్రములు వీక్షించుటకు ఈ క్రింది లంకెను ఉపయోగించండి.

https://plus.google.com/u/0/photos?tab=mq#photos/105802903792469439891/albums/5743865105855771137


స్వస్తి.





















 

28 April, 2012

మా నైనితాల్ యాత్ర

మా నైనితాల్ యాత్ర


చి! భరద్వాజ్ కుమార్, చి! నాగశ్రీవల్లి వారి పిల్లలు చి!మహాన్యాస్, చి!సహిష్ణులతో, వార్షిక క్లబ్ మహేంద్రా రిసార్టు విహార యాత్రా భాగంగా ఈ ఏడాది నైనితాల్ దగ్గరలోని క్లబ్ మహేంద్రా రిసార్టులో విడిది చేసి దగ్గరలోని యాత్రా స్థలాలో సేదతీరారు. ఈ విహారయాత్రలో మేము కూడా అంటే నేను, (మోడరేటర్), చిరంజీవులు జగదీశ్వరి, సునీల్, స్వప్నసుందరి, సౌందర్యలహరిలు కలిసి ఆనందించారు.

ఆయాత్రకు సంబందించిన ఛాయచిత్రములు ఈ లింకులో చూడవచ్చును. మిగతా విశేషాలు తరువాయిభాగములో వివరిస్తాను.


https://picasaweb.google.com/106354501050392165917/27April201202#







12 April, 2012

చి.లక్ష్మీనరసింహమూర్తి షష్ట్యబ్ధిపూర్తి మహోత్సవాహ్వానము

చి.లక్ష్మీనరసింహమూర్తి షష్ట్యబ్ధిపూర్తి మహోత్సవము ది.22.04.2012 నుండి 24.04.2012 వరకు

దమ్మాయిగూడా లోని భారద్వాజ నిలయములో జరుగును.


చి.చైతన్య చి.ప్రశాంత్ ల ఆధ్వర్యములో జరుగు ఈ ఉగ్రరధశాంతి విజయవంతముగా జరుపుటకు, కీసర వంశస్థులందరూ భారీసంఖ్యలో భాగ్యనగరములో ఏకత్రితమగుచున్నారు.

చిరంజీవి మూర్తి పుత్రులు, కోడళ్ళు, మనుమరాళ్ళు పంపిన ఆహ్వన పత్రిక చూడండి.
ఆ రోజులలో భాగ్యనగరములో కలిసి, జరుగబోవు వేడుకలలో ఉత్సాహంగా పాల్గొని అందరికీ
ఆనందం పంచుదాము.














02 April, 2012

కర్మానుభవము-పూజాదికముల ఫలము

కర్మానుభవము-పూజాదికముల ఫలము


అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభా శుభం" అన్న మాట మనమందరమూ తరచుగా వింటూ ఉండేదే. మనము చేసుకొన్న మంచి, చెడుపనుల ఫలితాలను మనమే అనుభవించక తప్పదని దీని తాత్పర్యము. మన జీవితం దీని ఆధారంగానే నడుస్తూ ఉంటుంది. "ఎలాగూ కర్మ ఫలాన్ని అనుభవించడము తప్పదు గదా, అటువంటప్పుడు ఈ జపతపాదులూ, ధ్యానమూ, పూజాదికాలు ఎందుకు చేయాలి?" అని చాలా మంది అడుగుతూ ఉంటారు.

పైపైన చూస్తే ఈ ప్రశ్న చాలా తర్కబద్ధమైనదిగానూ, సహేతుకమైనదిగానూ, సహజమైనదిగానూ అనిపిస్తుంది. ఈ పూజాదికాలు, మంత్రజపాలూ, సాధనలూ అన్నీ నిష్ప్రయోజనమని అనిపించే ప్రమాదమూ లేకపోలేదు. అందుకే దీన్ని గురించి మరింత లోతైన విచారణ చేయవలసి ఉన్నది. లోతైన విచారణ చేస్తే కొన్ని ధర్మ సూక్ష్మాలుగోచరిస్తాయి.

ఇక్కడ అనుభవిచడమంటే ఏమిటన్న ప్రశ్న వేసుకోవాలి. ప్రశ్న విచిత్రంగా కనిపించినా చాలా అర్థవంతమైనది. ఉదాహరణకు, మనం హాయిగా ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో ఒక భయంకరమైన కల వచ్చిందనుకోండీ. కౄరులైన దొంగలు మనవెంటపడి, చేతులు కాళ్ళు నరికి మనదగ్గరున్న డబ్బంతా దోచుకొని మనలను నట్టడవిలో వదలి వెళ్ళినట్లు కలగన్నామనుకోండి. ఈ కలకంటున్నంతసేపూ, ఇది కేవలం కల మాత్రమే, నాకేమీ కాలేదు అని భావించి హాయిగా ఉండగలుగుతున్నామా లేక వాస్తవిక ప్రపంచంలో మనకు ఈ దుస్సంఘటన జరిగితే ఎంత బాధ అనుభవిస్తామో అంత బాధా అనుభవించామా? నిస్సందేహంగా అంత ఘోరమైన వేదనా అనుభవించాముగదా? నిద్ర లేచాక గూడా కాళ్ళూ చేతులూ తడిమి చూసుకొని, అమ్మయ్యా నాకేమీ కాలేదు అని హాయితో కూదిన ఒక నిట్టూర్పు విడుస్తున్నామే. మరి కర్మఫలము అనుభవించినట్లా లేక అనుభవించనట్లా? అంటే స్థూల శరీరంతో పొందే అనుభవానికీ, సూక్ష్మ శరీరంతో పొందే అనుభవానికీ ఏమాత్రమూ తేడా లేదన్న విషయాన్ని సులభంగానే గ్రహించవచ్చును.

బలంగా పేనిన ఒక లావుపాటి మోకు (తాడు)తో, మనము సాధించుకొన్న కర్మఫలాలను పోల్చి చూద్దాము. ఆతాడులాగే అవికూడా చాలా బలంగా, తెంచడానికి వీల్లేనంత గట్టీగా ఉంటాయి. కానీ అదే తాడును ఉన్న పళంగా తగులబెట్టామనుకోండి. బూడిదగామారిన ఆతాడు, గాలికి చెదరి పోయేటంత వరకూ చూడటానికి తాడులాగే కనిపిస్తూ ఉంటుంది. కానీ మునుపటి గట్టితనం గానీ, బంధించగలిగే శక్తి గానీ దానికి ఉండవు. తాకుతూనే పొడి పొడిగా మారిపోతుంది. చిత్తశుద్ధితో చేసే జప తపాలూ, దైవనామ సంకీర్తన, సత్సంగమూ, పూజాదికాలు సరిగ్గా ఇటువంటి పనినే చేస్తాయి. బలంగా ఉన్న కర్మఫలాలు అనే పాశాలను దహనం చేసి, శిథిలం చేసి, తేలికగా అనుభవించి పోగొట్టుకోగలిగేటట్లు చేస్తాయి. ఈ విధంగా అనేక జన్మలెత్తి అనుభవించ వలసిన కర్మఫలాలను కూడా జప తపాదులు, దైవనామ సంకీర్తన, సత్సంగమూ, పూజాదికాలు, స్థూలశరీరంతో అనుభవించే బదులుగా సూక్ష్మ శరీరంతో అనుభవించి పోగొట్టుకోగలిగేటట్లుచేసి, కర్మక్షయాన్ని శీఘ్రతరం చేస్తాయి.

ఈ విధంగా ఒక వైపు సూక్ష్మశరీరంతో అనుభవించడం ద్వారా కర్మఫలాన్ని శీఘ్రంగా నిశ్శేషం చేసుకోడంతోపాటుగా, శేష జీవితాన్ని నిష్కామకర్మలు గావిస్తూ, వాసనలను, అనుబంధాలనూ పెంచుకోకుండా గడపగలిగితే ఇదేజన్మనే మనం చివరి జన్మగా చేసుకోవచ్చును. ఎందుకంటే కర్మఫలాన్ని నిశ్శేషం చేసుకోవడానికీ, మనలో తలెత్తుతున్న వాసనలనూ, కోరికలనూ సంపూర్తి చేసుకోవడానికే గదా జన్మపరంపర ప్రాప్తిస్తున్నది. చాలా ఉన్నతమైన, తీవ్ర స్థాయిలో, తీవ్రమైన ఆర్తితో చేసే జపతపాలు, అనుష్ఠానాల ద్వారాపొందగలిగిన స్థితి ఇది.

ఇంకా అనేక స్థాయిలలోకూడా ఈ విషయాన్ని పరిశీలిద్దాము. కర్మఫలం చాలా బలీయంగా ఉండి, మనం చేస్తున్న పూజాదికాల స్థాయి అంత ఉన్నతంగా, తీవ్రంగా లేక పోయినప్పటి పరిస్థితి ఏమిటి?

ఉదాహరణకు, బలీయమైన కర్మఫలాన్ని తీవ్రమైన సూర్యతాపంతో పోల్చి చూద్దాము. ఎండయొక్క కాంతినీ, ఉష్ణతీవ్రతనూ ఎవ్వరూ తగ్గించలేరు. అది ఎంత ఉందో అంతే ఉంటుంది. అటువంటి ఎండలో మనము శరీరానికి కానీ. పాదాలకు కానీ ఎలాంటి అఛ్ఛాదనా, రక్షణా లేకుండా వెళ్ళవలసి వస్తే ఆ బాధానుభవము భరించరానంత తీవ్రముగా ఉంటుంది గదా? కానీ పలుచటి తెల్లటి నూలు వస్త్రాలూ, కంటికి నల్ల కళ్ళద్దాలూ, కాలికి జోడూ, తలకు టోపీ, చేతిలో గొడుగూ ధరించి వెళ్ళితే కలిగే బాధ చాలా తక్కువ తీవ్రత కలిగి ఉంటుంది. మనము తేలికగా అనుభవించగలిగే స్థాయిలోనే ఉంటుంది. ఈ విధంగానే మనం చేసే పూజాదికాలు, సత్కర్మలు బలీయమైన కర్మఫలాన్ని కూడా మనము తేలికగా అనుభవించి పోగొట్టుకోగలిగిన స్థాయికి తీసుకొని వస్తాయి. ఈ ఉదాహరణ ద్వారా, ఎంతటి స్థాయిలో చేసేవైనా మనం చేసే పూజా పునస్కారాలు, జపతపాదులూ వ్యర్థంగా పోవని తేటతెల్లమౌతున్నది గదా!

ఇదే విషయాన్ని ఇంకొక స్థాయిలో కూడా పరిశీలిద్దాము. మనం అనుభవించితీరవలసిన కర్మఫలం అత్యంత బలీయం గానూ, తీవ్రం గానూ ఉండి ఏమాత్రమూ తగ్గించగలిగిన స్థాయిలో లేదనుకొందాము. అయినా నిరాశ చెందనవసరం లేదు.

మనం చేసే పూజాది సత్కర్మలు మనకు కర్మఫలాన్ని ప్రశాంతంగా, నిశ్చింతగా అనుభవించగలిగే శక్తినీ, స్థిత ప్రఙ్ఞత్వాన్నీ ప్రసాదిస్తాయి. మిన్ను విరిగి మీదపడినా చలించకుండా ఉండగలిగే అచంచలమైన స్థైర్యాన్ని దైవానుగ్రహం వల్ల పొందగలము. ఎంతటి ఘోరవిపత్తునైనా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ అనుభవించడం కన్నా, చిరునవ్వుతో, హాయిగా, స్థిరచిత్త్తంతో అనుభవించగలగడం గొప్ప విషయమే గదా. ఈ శక్తిని పూజాఫలంగా పొందగలిగిన వారినెందరినో మనము నిత్యజీవితంలో చూస్తూనే ఉన్నాము. మనము కూడా ఆ శక్తిని తప్పక సాధించగలము. లభించినది ఘోరాతి ఘోరమైన బాధే ఐనప్పటికీ కూడా "సర్వమున్ అతని దివ్య కళామయమంచు" భావన చేయగలిగే ఉత్తమ సంస్కారము, తత్ఫలంగా లభించే మనశ్శాంతి దైవానుగ్రహఫలమే గదా.

ఈసందర్భంగా ఇక్కడొక విషయాన్ని గురించి కూడా ప్రస్తావించుకోవాలి. కర్మ మూడు రకాలు అని పెద్దలు చెబుతారు. అవి:

Ø సంచితకర్మ

Ø ప్రారబ్ధ కర్మ

Ø ఆగామి కర్మ

మనం అనేక జన్మలుగా చేసుకొన్న సత్కార్యాలు, దుష్కార్యాల ఫలితంగా సంపాదించుకొన్న కర్మఫలాన్ని సంచితకర్మ అంటారు. కొండల్లాగా పడిఉన్న ఈ సంచితకర్మనుండి, ఈ జన్మ ఎత్తేముందు జీవుడు అనుభవించి క్షయం చేయడానికి తెచ్చుకొన్న కర్మను ప్ర్రారబ్ధ కర్మ అంటాఋ. ఇప్పుడు ఈ జన్మ ఎత్తిన తర్వాత మరలా మనం చేసే సత్కార్యాలు, దుష్కార్యాల ఫలంగా, మరలా సంచిత కర్మలో చేరిపోయి, రాబోయే జన్మకు ప్రారబ్ధ కర్మ గా పరిణమించబోయేది ఆగామి కర్మ.

ఇఫ్ఫుడు ప్రారంభమైన కర్మ అనగా ప్రారబ్ధకర్మ విడిచిన బాణంలాంటిది. ఈ జన్మలో మన జీవిక ఎలా సాగిపోవాలో నిర్ణయించబడి ఉంటుంది ప్రారబ్ధ కర్మ ద్వారా. దీన్నే ఈ జన్మకు "విధి" (Pre-Destination)అని అనవచ్చు.

చాలా సందర్భాల్లో ఒక చర్చ తలెత్తుతూ ఉంటుంది. మనిషికి ఏమైనా చేయడానికి స్వేచ్చ ఉంటుందా లేక అంతా ప్రారబ్ధ కర్మ ద్వారా నిర్ణయించబడిన ఒక పూర్వ నిర్ణీత ప్రణాళిక ప్రకారమే జరుగుతూ ఉంటుందా? అన్నది ఒక పెద్ద ప్రశ్నగా లేవనెత్తబడుతూ ఉంటుంది. దీన్నే”What is true, Free will or Pre-Determination?” అన్న చర్చగా భావించవచ్చు.

నిజానికి రెండూ సరియైనవే. మనిషికి నిర్ణయ స్వేఛ్ఛా(Free will) ఉన్నది అలాగే పూర్వ నిర్ణీత ప్రణాళికా(Pre-Determination) ఉన్నది. వినడానికి ఇది చాలా విడ్డూరంగానూ పరస్పరవిరుద్ధ విషయం గానూ అనిపిస్తుంది. దీన్ని గురించి కొంత విపులమైన చర్చ జరిపి, సమన్వయం ఎలా సాధ్యమౌతుందో చూద్దాము. పూర్వజన్మలలో తాను చేసుకొన్న సత్కర్మలు, దుష్కర్మల ఫలితంగా ఒక పూర్వ నిర్ణీత ప్రణాళిక్గ ఈ జన్మ కొరకు సిద్ధమయ్యే ఉంటుందన్న మాట సంపూర్ణంగా సత్యమే. కానీ దీనికీ ఒక పరిమితి ఉంది. ఏదో ఒక కార్యాచరణను ఎంపిక చేసుకొనవలసిన పరిస్థితులను కల్పించడం వరకూ (Destiny or Pre-Determination) పుర్వ నిర్ణీత ప్రణాళిక తన పాత్ర నిర్వహిస్తుంది. కానీ ఇక్కడవరకూ వచ్చిన తర్వాత మంచి మార్గాన్ని ఎంపిక చేసుకోవాలా, లేక చెడు మార్గాన్ని ఎంపిక చేసుకోవాలా అన్నది మన వివేకాని(Wisdom)కి, స్వేచ్చ(Free-Will)కు వదలి వేయ బడుతున్నది. ఇక్కడ మనకు సంపూర్ణమైన స్వేచ్చ ఉన్నది. ఇప్పుడు మనం చేసుకొనే ఎంపిక రాబోయే జన్మలో మన విధి (Destiny or Pre-Determination) ని నిర్ణయిస్తుంది.

ఒక చిన్న ఉదాహరణతో మనం దీన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు:

మనం ఒక మిత్రుని ఇంటికి వెళ్ళిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరనుకోండి. ఎక్కడో లోపల బాత్రూంలో మన మిత్రుడు స్నానం చేస్తూ ఉంటాడు. మీరు అతనిని పిలవగానే, "అలా సోఫాలో కూర్చో. కాస్సేపట్లో వస్తాను" అని సమాధానమిచ్చాడు. అక్కడ టేబుల్ మీద ఒక పదివేల రూపాయల నోట్ల కట్ట ఉంది. దాన్ని మనం తస్కరించినా ఎవరికీ అనుమానం రాదు. మన ఆర్థిక సంపన్నతా, మనమీద అతనికి గల విశ్వాసం, మన స్నేహం అటువంటివి.

మరి ఈ పరిస్థితిలో గుట్టు చప్పుడు కాకుండా ఆ నోట్ల కట్టను జేబులో వేసుకొని, "మళ్ళీ వస్తాలేరా" అని చెప్పి జారుకోవచును. ఇది ఒక ఎంపిక (one choice), లేదా, "ఇంత అజాగ్రత్త పనికిరాదు. డబ్బు విషయంలో కాస్త జాగ్రత్త అవసరం" అని మన నేస్తానికి నాలుగు చీవాట్లు పెట్టి, డబ్బును అతనికే అప్పగించి రావడం ఇంకొక ఎంపిక (another choice). ఈ పరిస్థితి కల్పించి ఈ రెంటిలో నుంచి ఎంపిక చేసుకొనే అవకాశం కల్పించడం వరకూ (పూర్వజన్మల కర్మల ఫలితంగా, మనం తెచ్చుకొన్న ప్రారబ్ధ కర్మచే ఏర్పడిన) విధి (Destiny or Pre-Determination) తన పాత్ర నిర్వహిస్తున్నది. ఇక్కడ నుంచి మన స్వేచ్చకు అవకాశం లభిస్తున్నది (From here the Free-Will comes into operation).దుష్కార్యాన్ని చేసి మరింత ఛెడుకర్మ లేక దుష్కర్మను మూట కట్టుకోవడమా లేక సన్మార్గంలో ప్రవర్తించి రాబోయే జన్మకు మూలధనంగా సత్కర్మను సాధించుకోవడమా అన్న స్వేచ్చావరణం (Freedom to exercise Free-Will) మనకు సంపూర్ణంగా ఉన్నది.

సరిగ్గా ఇటువంటీ పరిస్థితి ఎదురైనప్పుడు, అంటే దుష్కర్మ, సత్కర్మల మధ్య ఎంపిక చేఉకోగలిగే అవకాశం మనకు లభించినపుడు, సత్కార్యాన్ని మాత్రమే ఎంపిక చేసుకొని సత్కర్మను సాధించుకోగలిగే సద్బుద్ధిని ప్రసాదిస్తాయి మనం చేసుకొనే పూఃజాదులు, జపాలు, మహాత్ముల చరిత్ర పారాయణలు, దైవనామ సంకీర్తన వంటివి. ఈవిధంగా ప్రారబ్ధ కర్మ తీవ్రతను తక్కువ చేయడమో, శిధిలం చేయడమో, లేక కనీసం అనుభవించగలిగే స్థాయికి దించడమో మాత్రమే గాక సంచిత, ఆగామి కర్మలను కూడా నిర్ణయించగలుగుతాయి మనం చేసే పూజాదికాలు

"పూజాదికాలు-కర్మానుభవము" అన్న విషయాన్ని గురింఛిన చర్చ ముగించబోయే ముందు, గురునానక్ జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటనను గూర్చి చెప్పుకోవాలి.

గురునానక్ వద్దకు ఇద్దరు భక్తులు వస్తూ ఉండే వారు. వారిలో ఒకరు మంచి కర్మలు చేస్తూ ఉత్తమ జీవితాన్ని గడిపేవాడు. రెండవ వాడు స్త్రీవ్యసన పరాయణూడు, పచ్చి వ్యభిచారి. ఒక రోజు మంచి ప్రవర్తన కలిగిన ఉత్తమ భక్తుడు గురునానక్ దర్శనానికి వస్తున్న సమయంలో అతనికి కాలికి ముల్లు గుచ్చుకొని చాలా బాధ పెట్టింది. వ్యభిచారియైన వాడు ఒక రోజు వేశ్య వద్దకు వెళ్ళలేదు. గురునానక్ దర్శనానికి వెళ్ళాలనిపించి బయలుదేరాడు. త్రోవలో అతనికి ఒక కుండ దొరికింది. అందులో నిండుగా బొగ్గులు, ఒక బంగారు నాణెము దొరికాయి. వారిద్దరూ గురునానక్ ను సమీపించి తమ అనుభవాలు వినిపించి వివరణ కోరారు. గురునానక్ ఇలా చెప్పారు: సన్మార్గుడైన భక్తునికి పూర్వజ్నమ కర్మ ఫలంగా కాలికి నాగలికర్రు గుచ్చుకొని, కాలు తీసివేయవలసి ఉండినదనీ, కానీ అతని భక్తి వల్ల అంత తీవ్రమైన దుష్కర్మ ఫలంకూడా ముల్లు గుచ్చుకొంటే తీరిపోయే స్థాయికి వచ్చిందనీ చెప్పారు.

అలాగే బంగారునాణేలతో నిండిన కుండను పొందవలసిన రెండవవ్యక్తి తన వేశ్యా లాలస అనే దుష్కర్మ వల్ల అవన్నీ బొగ్గులుగా మారి, వేశ్యా సాంగత్యం ఒక్కరోజు చేయకుండా, గురు దర్శనం చేసినఫలితంగా ఒక్క బంగారు నాణెం లభించిందనీ చెప్పారు. ఇలా కర్మానుభవ సూక్ష్మాన్ని వివరిస్తారు గురునానక్.

మెట్టవేదాంతపు పలుకులు వల్లిస్తూ మనకు విధించబడిన కర్మలను (దైవ, పితృ,కర్మలను) ఆచరించడం ద్వారా మనం పొఆపాన్ని మూట కట్టుకొంటున్నామే గానీ ఉత్తమ స్థితిని చేరుకోవడం లేదన్నది నిష్ఠుర సత్యం. ఏ విధంగా చూచినా పూజాది సత్కర్మలు మనివేయదగినవి కావని ఈ చర్చ ద్వారా తేలుతున్నది. నిరంతరంగా, నిశ్చల, స్థిర చిత్తంతో చేసిన జపతపాదులు మనలను పునీతులను చేసి, ఙ్ఞానసాధనకు అనుకూలమైన స్థితికి చేరుస్తాయి. "మోక్ష సాధన సామాగ్ర్యాం భక్తిరేవ గరీయసి” అన్న ఆదిశంకరుల పలుకులు ఈ సమయంలో స్మరించుకోదగ్గవి. కనుక మనకు విధించబడిన, ఆర్యోక్తమైన దైవికకార్యాలు, సద్గ్రంధ పారాయణమ్ గురూపదిష్టమైన మంత్రజపాదులు చేసుకోవడం, సత్పురుషుల, మహాత్ముల, సాంగత్యం చేయడం మనకు అత్యంత శ్రేయస్కరమైన విషయాలని గ్రహించవలసి ఉన్నది.

//మంగళం మహత్//

31 March, 2012

శ్రీరామనవమి శుభాకాంక్షలు

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు




రేపు మనం "శ్రీరామనవమి" పర్వదినమును జరుపుకోబోతున్నాము. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని "శివ ధనుర్భంగము" గురించి నాలుగు మాటలు చెప్పుకుందాం.



"శ్రీమద్రామాయణము" ఆబాలగోపాలానికి ఆదరపాత్రమైన ఆదికావ్యము. అందులోనూ మన తెలుగువారికి సీతారాములు ఆరాధ్యదైవాలు. తెలుగునాడులో శ్రీరాముని గుడి లేని గ్రామం లేదు. తెలుగువాడు "శ్రీరామ" చుట్టకుండా ఏ వ్రాతా ప్రారంభించడు. మన గోదావరీతీరం సీతారాముల పవిత్ర పాదపరాగములతో పులకించిపోయింది. అందువల్లనే, రామకథ అంటే తెలుగువారికి అంతులేని అభిమానం. తెలుగుభాషలో ఉన్నన్ని రామాయణాలు, మరే ఇతరభాషలోనూ లేవంటే అతిశయోక్తి కాదు.



"శ్రీరామనవమి"కి తెలుగునాట వాడవాడలా సీతారాముల కళ్యాణం రంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి, వారి వివాహం ఏవిధంగా సంభవించింది? స్వయంవర నియమం ప్రకారం రఘువీరుడు శివధనుస్సును ఎక్కుపెట్టి విరిచినందువల్లకదా!-------- ఈ శివధనుర్భంగ సన్నివేశాన్ని వివిధ కవులు తమతమ కావ్యాల్లో అద్భుతంగా వర్ణించారు. ఆ ఘట్టాన్ని కొంతమంది కవీశ్వరులు ఏవిధంగా మన ఎదుట రూపుకట్టించారో స్థూలంగా చెప్పడమే ఈనాటి ఈ వ్యాసము యొక్క ఉద్దేశ్యము.



కవులలో ఎవరి శైలీవిన్యాసం వారికి ఉంటుంది.... ముందుగా జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు తమ "రామాయణ కల్పవృక్షము"లో ఈ సన్నివేశాన్ని ఎలా వర్ణించారో తెలుసుకుందాము. వారు ఈ సందర్భంగా ఆణిముత్యాల వంటి 2 పద్యములను మనకు అందించారు.



అందులో మొదటి పద్యమును చిత్తగించండి.



నిష్ఠావర్ష దుదార మేఘపటలీ నిర్గచ్ఛదుద్యోతిత

స్పేష్ఠేరమ్మదమాలికాయుగపదుజ్జృంభన్మహాఘోర బం

హిష్ఠ స్ఫూర్జథుషండ ఘుర్ఘుర రవాహీన క్రియాప్రౌఢి ద్రా

ఘిష్ఠమ్మై యొక రావ మంతట నెసంగెన్ ఛిన్న చాపంబునన్





ఆలంకారికులు కవిత్వమును స్థాయీభేదములను బట్టి 3 విధములుగా వర్గీకరించినారు. ఆ త్రివిధములైన ద్రాక్షాపాక, కదళీపాక, నారికేళపాకములలో నారికేళపాకము కఠినంగా ఉంటుందని, సులభంగా అర్థంకాదనీ అంటారు. ఐతే, చాలామంది విశ్వనాథవారి శైలిని పాషాణపాకమనీ, అది నారికేళపాకము కన్నా ప్రౌఢంగా ఉంటుందనీ చెప్తారు. విశ్వనాథవారు అలతి అలతియైన తేలికపదములతో వ్రాసిన పద్యములు లేకపోలేదు; అవి చాలా తక్కువ!



"రామాయణ కల్పవృక్షము" లోని పద్యములన్నింటిలోకి పై పద్యమే మిక్కిలి కఠినమైనదని చెప్పవచ్చును. ఐతే, అంత కఠినంగా ఉండుటయే ఈ పద్యము యొక్క సార్థక్యము, సౌందర్యము!



శ్రీరామచంద్రుడు శివధనుర్భంగము చేసినపుడు, ఆ ఛిన్న చాపము నుండి వెడలిన పరమదీర్ఘమైన, పరమకఠోరమైన ధ్వనిని స్ఫురింపజేయుట ఈ పద్యము యొక్క ప్రయోజనము. "ద్రాఘిష్ఠమ్మై ఒక రావము అంతట నెసంగెన్" అన్నారు. "రావము" అంటే శబ్దము; "ద్రాఘిష్ఠము" అనగా దీర్ఘతమము. పద్య ప్రారంభము నుండి 3 పాదములదాకా విస్తరించి సాగిన సంస్కృతసమాసము ఆ వింటిధ్వని యొక్క దీర్ఘత్వమును అమోఘంగా సూచిస్తున్నది.



ఇప్పుడు పద్యభావమును పరికిద్దాము.



"ఎడతెగకుండ వర్షించుచున్న అమోఘమైన మేఘముల సమూహము నుండి మిక్కిలిగా వచ్చు మెరుపుతీగలతో పాటు విజృంభించు పిడుగుల సమూహముల యొక్క ఘుర్ఘురధ్వనిని తక్కువ చేయునట్లుగా మిక్కిలి దీర్ఘమైన ఒక రావము ధనుస్సు నుండి వెలువడెను" అనేది ఈ పద్య తాత్పర్యము.



పద్యభావమును అవగతం చేసుకోలేకపోయినా, కేవలం పద్యమును చదివినంతమాత్రము చేతనే ఆ భీకరధ్వనిని ఊహించగలుగుతారు చదువరులు! అదే కవీశ్వరుల ప్రతిభ! ఈ పద్యములో విశ్వనాథవారు షకారముతో కూడిన ఠకారముతో దుష్కరమైన ప్రాసను వేసినారు. ద్వితీయ పాదారంభములో "స్పేష్ఠే" అనే పదము ధనుర్భంగ సందర్భములోని విస్ఫోటమును అద్భుతంగా ఆవిష్కరిస్తున్నది. మరి, ఇంతటి భయంకరమైన రావమును వర్ణించడానికి తేలికపదములను వినియోగిస్తే, మీసములు లేకుండా భీమసేనుని వేషము వేసినట్లుగా ఉంటుంది!...... అందుకే విశ్వనాథవారు అంత కఠినమైన సుదీర్ఘ సమాస ప్రయోగం చేశారు.



ఇక, 2వ పద్యములో ఆ భీకరధ్వని యొక్క కాఠిన్యము ఎటువంటిదో వివరిస్తున్నారు.



హేరంబోన్నత శూర్పకర్ణ వివర హ్రీకారియై, షణ్ముఖ

స్ఫార ద్వాదశనేత్రగోళ వివృతి ప్రాకారమై, శైలక

న్యారాజన్నవ ఫాలమండల విభుగ్నక్రీడమై, ఆశ్చల

ద్గీరుగ్ర ప్రమథంబుగా ధనువు మ్రోగెన్ శైవలోకంబులన్

ఆ వింటిధ్వని వినాయకుని చేటలవంటి చెవితొఱ్ఱలకు సిగ్గును కలిగించినదట! గణేశుడు గజముఖుడు కదా! అందుకే ఆయనవి శూర్పకర్ణములు, అనగా చేటలవంటి విశాలమైన వీనులు! అటువంటి విశాల కర్ణములకే ఆ నాదము శ్రవణభీకరంగా ఉన్నదంటే, ఇక మామూలు మానవులకు ఎలా ఉండివుంటుంది!!.... ఇంకా ఏమంటున్నారో చూడండి. షణ్ముఖుడైన కుమారస్వామి విస్మయముతో తన 12 నేత్రములను విప్పార్చి చూచునట్లుగా చేసినదట ఆ రావము! కుమారస్వామి 6 శిరస్సులను కలిగినవాడు, అనగా 12 నయనములు! ఇకపోతే, గిరిరాజసుతయైన పార్వతీదేవి సైతం ఆ భయంకర నాదాన్ని విని, అప్రయత్నంగానే తన భ్రుకుటిని ముడివేసినదట! ఆమె అందమైన లలాటఫలకం ఆశ్చర్యముతో ముడివడిపోయినదట! ఇక, శివపార్వతులను సేవించే ప్రమథగణాలన్నీ ఆ భీకర విస్ఫోటన ధ్వనిని విని భయముతో "ఆఃప్రకట" రావము చేస్తూ అచేతనులు అయినారట!.... ఈవిధంగా "ధనువు మ్రోగెన్ శైవలోకంబులన్".



శివధనుర్భంగము యొక్క పరిణామము కైలాసములో, కైలాసవాసులలో ఏ రకంగా ప్రతిఫలించినదో విశ్వనాథవారు ఈ పద్యములో ఎంతో హృద్యంగా వర్ణించారు. అది శివుని ధనుస్సు కాబట్టి, శివలోకమైన కైలాసములో కలిగిన అల్లకల్లోలమును వారు మన కళ్ళకు కట్టారు.



"కరుణశ్రీ" జంధ్యాల పాపయ్యశాస్త్రిగారు మధురకవిగా ప్రసిద్ధులు. ఎంతటి గంభీర విషయమునైనా అలవోకగా మృదుమధురమైన ఫణితిలో చెప్పగలగడం వారి ప్రత్యేకత!... మరి, శివధనుర్భంగాన్ని వారి మాటలలో విందాము.



ఫెళ్ళుమనె విల్లు! గంటలు ఘల్లుమనే!

గుభిల్లుమనె గుండె నృపులకు!

ఝల్లుమనియె జానకీ దేహము!

ఒక నిమేషంబునందె నయము, జయము, భయము, విస్మయము గదుర!



శ్రీరాముడు ఎక్కుపెట్టగానే శివధనుస్సు ఫెళ్ళుమని విరిగినది. ఆ వింటికి కట్టివున్న చిరుగంటలు ఘల్లుమని మ్రోగినవి. సభలో ఆసీనులైవున్న రాజకుమారులందరి గుండెలు ఆ భీకరనాదానికి గుభిల్లుమన్నాయి. ఇక, సీతాదేవి శరీరము ఝల్లుమని పులకరించిపోయింది..... ఎంత అందమైన, మనోహరమైన వర్ణన! ఈ చిన్నిపద్యములోనే అక్కడి వాతావరణాన్ని మనోజ్ఞంగా మన కనుల ముందర నిలిపినారు పాపయ్యశాస్త్రిగారు!.... ఒక్క నిమిషములోనే నయము, జయము, భయము, విస్మయము ప్రతిఫలించినాయట ఆ సభాస్థలిలో! విల్లు ఫెళ్ళుమనడానికి నయము, గంటలు ఘల్లుమనడానికి జయము, నరపతుల గుండెలు గుభిల్లుమనడానికి భయము, వైదేహి దేహము ఝల్లుమనడానికి విస్మయము ప్రతీకలు! ముందు 4 విషయములను చెప్పి, చివరి పాదములో నయము, జయము, భయము, విస్మయములను ఉటంకించి ఈ చిన్నిపద్యమును క్రమాలంకారములో తీర్చిదిద్దినారు కరుణశ్రీ!



ఇక, చివరగా మన సమకాలికుడైన ఒక ఆధునిక కవి గురించి తెలుసుకుందాము. ప్రముఖ సినీనిర్మాత ఎం.ఎస్.రెడ్డిగారు మంచి సాహితీపరులు. వారు తాము నిర్మించిన చిత్రాలలో పాటలు కూడా వ్రాస్తుంటారు. ఆయన గీతాలు చక్కని పదముల పొందికతో శ్రవణసుభగంగా ఉంటాయి. ఆయనను "సహజకవి, మల్లెమాల" అని పిలుస్తారు. బహుశా "మల్లెమాల" అనేది వారి ఇంటిపేరు కాబోలు! వారు రచించిన "మల్లెమాల రామాయణము" కొన్నాళ్ళ క్రితం టివి లో ఉదయంవేళల్లో ధారావాహికగా ప్రసారమయింది. ఆయన తన కావ్యములోని పద్యాలను చదువుతూవుంటే, మరొక సాహితీవేత్త దానికి వ్యాఖ్యానం చెప్పేవారు.



మరి, మల్లెమాలగారి "శివధనుర్భంగము" ఎలావుందో చూద్దాము.



ఫెళఫెళార్భటు లెనయంగ విరిగె ధనువు

భళిభళీ యని శుభమస్తు పలికె గురువు

ప్రీతిమెయి పులకించె భూమాత తనువు

తెలియకనె సీత మోమున మొలిచె నగవు

పద్యము చాలా సులభగ్రాహ్యంగా ఉంది; విడమరచి చెప్పవలసిన పని లేదు. 3వ పాదములో "పులకించె భూమాత తనువు" అన్నారు. సీత భూజాత కదా! తన కుమార్తెకు వివాహం జరగబోతుంటే ఏ తల్లి తనువు మాత్రం పులకించదు?!....... ఇక్కడ మరో అర్థం సైతం చెప్పుకోవచ్చు. జనులందరూ భూమాత ఒడిలోనే కదా ఉండేది! ఆమె తనువు పులకించినదని అంటే, పృథ్విపైనున్న సకల జీవుల తనువులు పులకించాయన్నట్లే!



"శివ ధనుర్భంగము" ఘట్టమును వివిధ కవులు ఎలా వర్ణించారో, నాకు తెలిసినంతలో వివరించే ప్రయత్నం చేశాను.







23 March, 2012

శ్రీ నందన నామ నూతన సంవత్సర - ఉగాది శుభాకాంక్షలు

శ్రీరామ


శ్రీ నందన నామ నూతన సంవత్సర - ఉగాది శుభాకాంక్షలు


శాస్త్రాణ్యధీత్యా2పి భవన్తి మూర్ఖాః
యస్తు క్రియావాన్ పురుషః స విద్వాన్
సుచిన్తితం చౌషధ మాతురాణాం
న నామమాత్రేణ కరోత్యరోగమ్


(హితోపదేశమ్- మిత్రలాభం-167)

విషయ సేకరణ,పరిజ్ఞానము (Scientific / General Knowledge) కలవారు విద్వాంసులు (వివేకులు) కారు. ఎవరైతే జ్ఞానాన్ని ఆచరణలో పెడతారో వారే వివేకులు. తన రోగ లక్షణాలకు సరిపడే మందు పేరు తెలుసుకున్నంత మాత్రమునగాని, సేకరించి పెట్టుకున్నంతమాత్రమున గాని రోగనివృత్తి కలుగదు గదా ! ఆ మందును విధివిధానముగ అనుపానములతోను, పథ్యమైన ఆహార-విహారాదులతోను నిర్ణీతకాల పరిమితి వరకు సేవిస్తేనే కదా ఆరోగ్యలాభం కలిగేది !

కాబట్టి మనం News Papers చదివినా, T.V.Programmes,News చూసినా, మన దేశము, భారతజాతి ప్రతిష్ఠలను గూర్చి, విలువల పతనం గూర్చి, మనలో కలిగే స్పందనలను కేవలం "వారు అట్లా; వీరు ఇట్లా !" అనుకుంటూ కూర్చునేకన్నా, "పరిస్థితిని బాగుచేసే యజ్ఞంలో నేనుకూడ ఏదోఒక్క సమిధనైనా వేయటానికి ప్రయత్నిస్తా" నని ఈ నూతన సంవత్సర నిర్ణయంగా భావించుదాం !


మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఈ నూతన సంవత్సరంలో

సకల సన్మంగళములను అనుగ్రహించమని

ఆ పరాత్పరుని వేడుకుంటున్నాము !

18 March, 2012

FROM OUR OLD ALBUM - YOUR MODERATOR AND HIS WIFE

This is a photograph of your moderator Mr.K.S.S.N.SARMA AND HIS WIFE JAGADEESWARI

      This photographs is taken on the occasion of their first marriage anniversary.

              

07 March, 2012

చి.పార్ధసారధిశర్మ భగవాన్ సత్యసాయి వచన శతకం ఆవిష్కరణ.

                                    చి.పార్ధసారధిశర్మ భగవాన్ సత్యసాయి వచన శతకం ఆవిష్కరణ.




తమ్ముడు చి.పార్ధసారధిశర్మ భగవాన్ సత్యసాయి వచన శతకం గుంటూరు మారుతీనగర్ లోని

మారుతీదేవాలయములో ఆవిష్కరణ 5.03.2012 న జరిగినది. ఈకార్యక్రమమునకు సంబంధించి

వార్తలు ఈనాడు దినపత్రిక, ఆంధ్రప్రభ దినపత్రికలలో ప్రచురించారు. ఈనాడు వార్త చిత్రకధనం ఇక్కడ

చూడవచ్చును. యశస్వీభవ.
 
 

03 March, 2012

శ్రీ మద్భగవద్గీత

సుమారు 5000 సంవత్సరాలకు పూర్వం నిజంగా జరిగిన చరిత్ర ఇది. ధృతరాష్ర్టుడు, పాండురాజు అన్నదమ్ములు. పాండురాజుకి 5గురు సంతానం. యుధిష్ఠిరుడు లేక ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అని క్రమంగ వారి పేర్లు. ధర్మరాజు సహజంగ మంచి గుణాలు కలిగిన ధర్మమూర్తి. ఆతని సోదరులు వినయవిధేయతలు కలిగి అన్నగారి మాటను జవదాటని బుద్ధిమంతులు. చిన్నప్పుడే వీరు తండ్రిని కోల్పోయారు. ద్రౌపది వీరి భార్య. ఈమె మహాపతివ్రతయే కాక గొప్ప శ్రీకృష్ణ భక్తురాలు కూడ. ధృతరాష్ర్టడు పుట్టుగ్రుడ్డి. ఇతనికి 100 మంది సంతానం. దుర్యోధనుడు వీరిలో పెద్దవాడు. అసూయకి, అహంకారానికి, స్వార్థానికీ, వంచనకీ ఇతడు మారుపేరుగ ఉండేవాడు. పాండురాజు చనిపోవడం వల్ల, ధృతరాష్ర్టుడు అంధుడు కావడం వల్ల దుర్యోధనుడే తనని రాజుగ ప్రకటించుకొని, తన తండ్రి తరపున హస్తినాపురాన్ని పాలిస్తూ ఉండేవాడు. పాండవులకి పెరిగి పెద్దయ్యాక రాజ్యంలో కొంతభాగం రావాలి కద! కానీ, దుర్యోధనుడి మోసపుటెత్తుల వల్ల రాజ్యం రాలేదు సరిగద, 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయవలసి వచ్చింది. ఒక ఏడాది విరాట రాజు కొలువులో అజ్ఞాతవాసం కూడ చేయవలసి వచ్చింది. ఇలా 13 సంవత్సరాలు రాజ్యభ్రష్ఠులై తిరిగిన పాండవులు గడువుతీరి, తిరిగివచ్చారు. తమకు ధర్మబద్ధంగ రావలసిన రాజ్యభాగము తమకిమ్మని కబురుపంపారు కౌరవులకి. ఎన్ని ప్రయత్నాలు చేసినా మొండి కౌరవులు, పాండవులకి రాజ్యాన్ని ఇవ్వడానికి అంగీకరించలేదు. చివరికి తప్పనిసరి పరిస్థితులలో యుద్ధము చేయవలసి వచ్చింది పాండవులకి. ఈ ద్వాపరయుగం చివరలో జరిగిన యుద్ధానికీ “మహాభారతయుద్ధ”మనే పేరు ప్రసిద్ధమైంది.




18 దినాలు జరిగిన ఈ మహాయుద్ధంలో 18 అక్షౌహిణీల సైన్యం పాల్గొన్నదట. అందులో 11 అక్షౌహిణీల సైన్యం కౌరవుల పక్షాన పాల్గొన్నదట. 7 అక్షౌహిణీల సైన్యం మాత్రమే పాండవుల పక్షాన చేరింది. ఆశ్చర్యమేమంటే, శ్రీకృష్ణభగవానుడు కూడా పాండవుల పక్షాన అర్జున సారథిగ ఈ యుద్ధంలో పాల్గొన్నాడు. ఒక అక్షౌహిణీ అంటే 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 అశ్వములు, 1,09,350 పదాతిదళము. రథంలో కనీసం ఇద్దరుంటారు. ఏనుగు పై ఇద్దరుంటారు. అశ్వం పై ఒక వీరుడుంటాడు. అంటే ఒక అక్షౌహీణీలో జంతువులు కాక 1,53,090 మంది వీరులుంటారు. అలాంటివి 18 అక్షౌహణీలంటే 27,55,620 మంది మనుష్యులు + జంతువులు.



దీనిని బట్టి మహాభారత యుద్ధంలో ఎంతమంది పాల్గొన్నారో కదా! యుద్ధం పూర్తయ్యేనాటికి ఒక్కరూ మిగలనే లేదట. అంతా వీరమరణాన్నే పొందారు. భీష్మపితామహుడు కౌరవులకీ, పాండవులకీ తాతగారు. చిన్నప్పటి నుండి వివాహం చేసుకోలేదు. బ్రహ్మచర్య వ్రతంలోనే జీవించిన మహాశక్తివంతుడు. ఈయనే కౌరవసేనకు అధినేత. ద్రౌపదికి సోదరుడైన ధృష్టద్యుమ్నుడు పాండవుల సేనకు అధిపతి. యుద్ధారంభానికి ముందే మహర్షి వేదవ్యాసభగవానుడు ధృతరాష్ర్టుడి దగ్గరకు వచ్చాడు. అతనికిష్టమైతే, జరిగే యుద్ధాన్ని ఇంట్లోంచే చూడగలిగే దివ్యదృష్టిని ఇస్తానన్నాడు. “దివ్యదృష్టి” అంటే ఎక్కడ జరిగే ఏ విషయాన్నైనా తలచినంతమాత్రానే ఉన్నచోటనే ఉండి దర్శింగలిగే శక్తి అన్నమాట. కానీ ధృతరాష్ట్రుడు దానికి ఇష్టపడలేదు. తన మిత్రుడు, సారథి కూడా అయిన సంజయునికా శక్తినిమ్మన్నాడు. అవసరమైతే అతనిద్వారా వివరాలు తెలుసుకుంటానన్నాడు. వేదవ్యాసమహర్షి దివ్యదృష్టిని సంజయునికే ఇచ్చి తన దారిన తాను వెళ్ళిపోయాడు.



సంజయుడు పరమ శ్రీకృష్ణ భక్తుడే అయినా, తన యజమాని ధృతరాష్ర్టుడికి మాత్రం నమ్మినబంటు, సరే అనుకున్న ప్రకారం, మహాభారత యుద్ధం మార్గశిర మాసారంభానికి ఒక రోజు ముందు ప్రారంభమైంది. యుద్ధరంగంలో ఇరుపక్షాలు చేరి యుద్ధారంభాన్ని ప్రకటించాక అర్జునునికి హఠాత్తుగ మనసు మారిపోయింది. తన బంధువులని చంపడం తగదని, ఎంత చెడిన వారైనా యుద్ధమే వద్దనిపించింది. వారు తప్పే చేసినా, హింసించడం మంచిది కాదనిపించింది. యుద్ధం మానేసి అడుక్కొనితిని బ్రతికినా మేలేననుకొన్నాడు. “దోషి ఎవరైనా, చివరకు తన బంధువే అయినప్పటికీ, దండనార్హుడే” దండించే అధికారమున్న వ్యక్తి సమయమాసన్నమైతే, దోషిని తప్పకుండా దండించితీరడమే కర్తవ్యం. అప్పుడు బంధుత్వాన్ని, హింసనూ తలవతగదు. రోగిని శస్త్రచికిత్స ద్వారా బాగుచేయవలసిన వైద్యుడు, శరీరాన్ని కోయడం, కుట్టడం వంటి పనులు చేయక తప్పదు కదా! వాటిని హింస అనలేము గదా! అదే అవసరం కూడా. ధర్మయుద్ధంలో జరిపే హింస గూడా అలాంటిదే అనే విషయం అర్జునుడు గుర్తించలేదు. కింకర్తవ్యతామూఢుడైన అర్జునుడికి కర్తవ్యాన్ని బోధించడానికి అన్నట్లు, లోకులందరికీ, నిత్యజీవన సమయంలో ఏ పని చేయాలో, ఏది మానాలో నిర్ణయించుకోలేని సందిగ్ధ పరిస్థితి ఏర్పడ్డప్పుడు కర్తవ్యబోధ చేసే అద్భుతమైన ఉపదేశంగ శ్రీ కృష్ణుడు అందించిన సందేశమే “భగవద్గీత”. విషాదంలో, పడి కర్తవ్యాన్ని గుర్తిచలేని మనిషికి, విశ్వసించి ఆశ్రయిస్తే, కర్తవ్యాన్ని ఆదేశించి దిశానిర్దేశం చేయగలిగిన, విజయపథంలో నడపగలిగిన ఉత్తమోత్తమమైన గ్రంథమే భగవద్గీత. యుద్ధ క్ష్రేత్రాన ఆవిర్భవించిన మహోపదేశమన్న మాట.



18 అధ్యాయాలుగా లభించిన ఈ మహోపదేశంలో 700 శ్లోకాలున్నాయి. ప్రతి అధ్యాయానికి ఏదో ఒక “...యోగః” అని పేరు. యోగమనే పదానికెన్నో అర్థాలున్నా, భగవద్గీతలోని అధ్యాయాల విషయానికి వస్తే ఉపాయము, సాధనము, మార్గము అనే అర్థాలు చెప్తారు ప్రామాణికులైన పెద్దలు. అంటే ప్రతీ అధ్యాయము గూడ ఆయా పేరు కల్గిన కర్తవ్యాన్ని తెలిపే ఒక్కొక్క సాధనమన్నమాట. శ్రీ కృష్ణుని ఉపదేశం విన్న అర్జునుడు తెలివి తెచ్చుకొని కర్తవ్యపాలనం చేసాడు. ఇక యుద్ధమారంభమైంది. సంజయుడికి దివ్యదృష్టిని యిప్పించినా, 10 దినాల దాక ధృతరాష్ర్టుడికి ఏమీ అడగాలని అనిపించలేదు. హఠాత్తుగా, 11వ దినాన భీష్మాచార్యుడు యుద్ధరంగంలో కుప్పకూలిపోయాడనే సమాచారం చేరింది. దాంతో, కృంగిపోయిన ధృతరాష్ర్టుడు సంజయుణ్ణి పిలిచాడు. “అసలేం జరిగిందయ్యా. మా వాళ్ళకీ, పాండవులుకీ కూడా భీష్ముడంటే అపరిమితమైన గౌరవం ఉందిగద! మరి వీళ్ళందరూ ఉంటూండగ ఆయనెలా పడిపోయాడు... ఏం చేస్తున్నారు వీళ్ళంతా... “అని ప్రశ్నించాడు. దివ్యదృష్టితో చూచి జరిగినదంతా చెప్పాడు సంజయుడు. అందుకే ప్రశ్నలో యుద్ధరంగంలో పోరాడలనే చేరినవాళ్ళు ఎలా యుద్ధం చేసారయ్యా “...కథమకురుత?” అని అడగాలి కానీ “..కిమకుర్వత?” ఏమి చేసారయ్యా? అని అడగడం కుదరదు గద. అలానే యుద్ధారంభానికి ముందే, అంటే మార్గశిర మాసారంభంలోనే శ్రీ కృష్ణుడు గీతోపదేశం చేసి అర్జునుణ్ణి యుద్ధంలో ప్రవేశపెట్టాడు. అయినా, ఆ రోజున ఒక్క అర్జునుడు తప్ప మిగిలిన వాళ్ళెవ్వరూ దానిని వినలేదు. బహుశః వినగలిగే స్థితిలో ఉండి ఉండరు. ధృతరాష్ర్టుడి ప్రశ్నతో సంజయుడు 11వ దినాన దానిని ప్రకటించాకనే లోకానికి యుద్ధానికి ముందుగ ఆ ఉపదేశం జరిగిందన్న విషయం తెలిసింది. అందుకే మార్గశిర శుక్ల ఏకాదశిని గీతాజయన్తిగ పాటిస్తారు. ఆనాడు, 700 శ్లోకాల భగవద్గీతను పూర్తిగ పఠించగలగడం అదృష్టం. లేదా, ఈ చరిత్రను తలచుకొని కొన్ని శ్లోకాలను చదువగలిగినా కొంత భాగ్యమే కద. ఇలా ధృతరాష్ర్టుడి ప్రశ్నతో భగవద్గీత లోకానికందిందనే కృతజ్ఞతతో, ఆయన ప్రశ్నతోనే గీతాపారాయణను ప్రారంభిస్తారు. రండి! మరి మనమూ ప్రారంభిద్దాం!



జైశ్రీమన్నారాయణ

27 February, 2012

సంస్క్రతములో పట్టము సాధించిన సాయిఅన్నయ్య

సంస్క్రతములో పట్టము సాధించిన సాయిఅన్నయ్య




అంతర్జాలములో ఈ_గురుకులము వారు నిర్వహించిన సంస్క్రతములో నాలుగువారములు జరిపిన తరగతులకు

అంతర్జాలముద్వారా హాజరయి మీ మోడరేటర్ సాయి అన్నయ్య పట్టము సాధించిన సంగతి తెలియపరచు

ధృవపత్రము చూడగలరు.





21 February, 2012

చి.శ్రీకాంత్ భరద్వాజ్ నూతన గృహప్రవేశము

చి.శ్రీకాంత్ భరద్వాజ్ నూతన గృహప్రవేశము




చి.పార్ధసారధి తనయుడు,చి.శ్రీకాంత్ భరద్వాజ్ ది.15.02.2012 న చెన్నైలో నూతనముగా

ఒక అపార్టమెంట్ కొనుక్కుని, సంప్రదాయముగా తల్లిదండ్రులచే గృహప్రవేశము చేయించాడు. ఈ సందర్భముగా పెద్దనాన్నగారు, శ్రీ విశ్వనాధంగారు, ఆమ్మశ్రీమతిసీతమ్మగారు, చెల్లెలు స్వప్న,బావగారు చి.చక్రవర్తి, విచ్చేసి, శుభాభివందనములు తెలిపారు. కీసర వంశస్తులందరు,

చి.శ్రీకాంత్ భరద్వాజ్, చి.కృష్ణప్రియలకు, శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ విశేషముల ఛాయాచిత్రములు ఇక్కడ చూడవచ్చును.
 



కీసర వంశము***** KEESARAVAMSAM