23 March, 2012

శ్రీ నందన నామ నూతన సంవత్సర - ఉగాది శుభాకాంక్షలు

శ్రీరామ


శ్రీ నందన నామ నూతన సంవత్సర - ఉగాది శుభాకాంక్షలు


శాస్త్రాణ్యధీత్యా2పి భవన్తి మూర్ఖాః
యస్తు క్రియావాన్ పురుషః స విద్వాన్
సుచిన్తితం చౌషధ మాతురాణాం
న నామమాత్రేణ కరోత్యరోగమ్


(హితోపదేశమ్- మిత్రలాభం-167)

విషయ సేకరణ,పరిజ్ఞానము (Scientific / General Knowledge) కలవారు విద్వాంసులు (వివేకులు) కారు. ఎవరైతే జ్ఞానాన్ని ఆచరణలో పెడతారో వారే వివేకులు. తన రోగ లక్షణాలకు సరిపడే మందు పేరు తెలుసుకున్నంత మాత్రమునగాని, సేకరించి పెట్టుకున్నంతమాత్రమున గాని రోగనివృత్తి కలుగదు గదా ! ఆ మందును విధివిధానముగ అనుపానములతోను, పథ్యమైన ఆహార-విహారాదులతోను నిర్ణీతకాల పరిమితి వరకు సేవిస్తేనే కదా ఆరోగ్యలాభం కలిగేది !

కాబట్టి మనం News Papers చదివినా, T.V.Programmes,News చూసినా, మన దేశము, భారతజాతి ప్రతిష్ఠలను గూర్చి, విలువల పతనం గూర్చి, మనలో కలిగే స్పందనలను కేవలం "వారు అట్లా; వీరు ఇట్లా !" అనుకుంటూ కూర్చునేకన్నా, "పరిస్థితిని బాగుచేసే యజ్ఞంలో నేనుకూడ ఏదోఒక్క సమిధనైనా వేయటానికి ప్రయత్నిస్తా" నని ఈ నూతన సంవత్సర నిర్ణయంగా భావించుదాం !


మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఈ నూతన సంవత్సరంలో

సకల సన్మంగళములను అనుగ్రహించమని

ఆ పరాత్పరుని వేడుకుంటున్నాము !

18 March, 2012

FROM OUR OLD ALBUM - YOUR MODERATOR AND HIS WIFE

This is a photograph of your moderator Mr.K.S.S.N.SARMA AND HIS WIFE JAGADEESWARI

      This photographs is taken on the occasion of their first marriage anniversary.

              

07 March, 2012

చి.పార్ధసారధిశర్మ భగవాన్ సత్యసాయి వచన శతకం ఆవిష్కరణ.

                                    చి.పార్ధసారధిశర్మ భగవాన్ సత్యసాయి వచన శతకం ఆవిష్కరణ.




తమ్ముడు చి.పార్ధసారధిశర్మ భగవాన్ సత్యసాయి వచన శతకం గుంటూరు మారుతీనగర్ లోని

మారుతీదేవాలయములో ఆవిష్కరణ 5.03.2012 న జరిగినది. ఈకార్యక్రమమునకు సంబంధించి

వార్తలు ఈనాడు దినపత్రిక, ఆంధ్రప్రభ దినపత్రికలలో ప్రచురించారు. ఈనాడు వార్త చిత్రకధనం ఇక్కడ

చూడవచ్చును. యశస్వీభవ.
 
 

03 March, 2012

శ్రీ మద్భగవద్గీత

సుమారు 5000 సంవత్సరాలకు పూర్వం నిజంగా జరిగిన చరిత్ర ఇది. ధృతరాష్ర్టుడు, పాండురాజు అన్నదమ్ములు. పాండురాజుకి 5గురు సంతానం. యుధిష్ఠిరుడు లేక ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అని క్రమంగ వారి పేర్లు. ధర్మరాజు సహజంగ మంచి గుణాలు కలిగిన ధర్మమూర్తి. ఆతని సోదరులు వినయవిధేయతలు కలిగి అన్నగారి మాటను జవదాటని బుద్ధిమంతులు. చిన్నప్పుడే వీరు తండ్రిని కోల్పోయారు. ద్రౌపది వీరి భార్య. ఈమె మహాపతివ్రతయే కాక గొప్ప శ్రీకృష్ణ భక్తురాలు కూడ. ధృతరాష్ర్టడు పుట్టుగ్రుడ్డి. ఇతనికి 100 మంది సంతానం. దుర్యోధనుడు వీరిలో పెద్దవాడు. అసూయకి, అహంకారానికి, స్వార్థానికీ, వంచనకీ ఇతడు మారుపేరుగ ఉండేవాడు. పాండురాజు చనిపోవడం వల్ల, ధృతరాష్ర్టుడు అంధుడు కావడం వల్ల దుర్యోధనుడే తనని రాజుగ ప్రకటించుకొని, తన తండ్రి తరపున హస్తినాపురాన్ని పాలిస్తూ ఉండేవాడు. పాండవులకి పెరిగి పెద్దయ్యాక రాజ్యంలో కొంతభాగం రావాలి కద! కానీ, దుర్యోధనుడి మోసపుటెత్తుల వల్ల రాజ్యం రాలేదు సరిగద, 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయవలసి వచ్చింది. ఒక ఏడాది విరాట రాజు కొలువులో అజ్ఞాతవాసం కూడ చేయవలసి వచ్చింది. ఇలా 13 సంవత్సరాలు రాజ్యభ్రష్ఠులై తిరిగిన పాండవులు గడువుతీరి, తిరిగివచ్చారు. తమకు ధర్మబద్ధంగ రావలసిన రాజ్యభాగము తమకిమ్మని కబురుపంపారు కౌరవులకి. ఎన్ని ప్రయత్నాలు చేసినా మొండి కౌరవులు, పాండవులకి రాజ్యాన్ని ఇవ్వడానికి అంగీకరించలేదు. చివరికి తప్పనిసరి పరిస్థితులలో యుద్ధము చేయవలసి వచ్చింది పాండవులకి. ఈ ద్వాపరయుగం చివరలో జరిగిన యుద్ధానికీ “మహాభారతయుద్ధ”మనే పేరు ప్రసిద్ధమైంది.




18 దినాలు జరిగిన ఈ మహాయుద్ధంలో 18 అక్షౌహిణీల సైన్యం పాల్గొన్నదట. అందులో 11 అక్షౌహిణీల సైన్యం కౌరవుల పక్షాన పాల్గొన్నదట. 7 అక్షౌహిణీల సైన్యం మాత్రమే పాండవుల పక్షాన చేరింది. ఆశ్చర్యమేమంటే, శ్రీకృష్ణభగవానుడు కూడా పాండవుల పక్షాన అర్జున సారథిగ ఈ యుద్ధంలో పాల్గొన్నాడు. ఒక అక్షౌహిణీ అంటే 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 అశ్వములు, 1,09,350 పదాతిదళము. రథంలో కనీసం ఇద్దరుంటారు. ఏనుగు పై ఇద్దరుంటారు. అశ్వం పై ఒక వీరుడుంటాడు. అంటే ఒక అక్షౌహీణీలో జంతువులు కాక 1,53,090 మంది వీరులుంటారు. అలాంటివి 18 అక్షౌహణీలంటే 27,55,620 మంది మనుష్యులు + జంతువులు.



దీనిని బట్టి మహాభారత యుద్ధంలో ఎంతమంది పాల్గొన్నారో కదా! యుద్ధం పూర్తయ్యేనాటికి ఒక్కరూ మిగలనే లేదట. అంతా వీరమరణాన్నే పొందారు. భీష్మపితామహుడు కౌరవులకీ, పాండవులకీ తాతగారు. చిన్నప్పటి నుండి వివాహం చేసుకోలేదు. బ్రహ్మచర్య వ్రతంలోనే జీవించిన మహాశక్తివంతుడు. ఈయనే కౌరవసేనకు అధినేత. ద్రౌపదికి సోదరుడైన ధృష్టద్యుమ్నుడు పాండవుల సేనకు అధిపతి. యుద్ధారంభానికి ముందే మహర్షి వేదవ్యాసభగవానుడు ధృతరాష్ర్టుడి దగ్గరకు వచ్చాడు. అతనికిష్టమైతే, జరిగే యుద్ధాన్ని ఇంట్లోంచే చూడగలిగే దివ్యదృష్టిని ఇస్తానన్నాడు. “దివ్యదృష్టి” అంటే ఎక్కడ జరిగే ఏ విషయాన్నైనా తలచినంతమాత్రానే ఉన్నచోటనే ఉండి దర్శింగలిగే శక్తి అన్నమాట. కానీ ధృతరాష్ట్రుడు దానికి ఇష్టపడలేదు. తన మిత్రుడు, సారథి కూడా అయిన సంజయునికా శక్తినిమ్మన్నాడు. అవసరమైతే అతనిద్వారా వివరాలు తెలుసుకుంటానన్నాడు. వేదవ్యాసమహర్షి దివ్యదృష్టిని సంజయునికే ఇచ్చి తన దారిన తాను వెళ్ళిపోయాడు.



సంజయుడు పరమ శ్రీకృష్ణ భక్తుడే అయినా, తన యజమాని ధృతరాష్ర్టుడికి మాత్రం నమ్మినబంటు, సరే అనుకున్న ప్రకారం, మహాభారత యుద్ధం మార్గశిర మాసారంభానికి ఒక రోజు ముందు ప్రారంభమైంది. యుద్ధరంగంలో ఇరుపక్షాలు చేరి యుద్ధారంభాన్ని ప్రకటించాక అర్జునునికి హఠాత్తుగ మనసు మారిపోయింది. తన బంధువులని చంపడం తగదని, ఎంత చెడిన వారైనా యుద్ధమే వద్దనిపించింది. వారు తప్పే చేసినా, హింసించడం మంచిది కాదనిపించింది. యుద్ధం మానేసి అడుక్కొనితిని బ్రతికినా మేలేననుకొన్నాడు. “దోషి ఎవరైనా, చివరకు తన బంధువే అయినప్పటికీ, దండనార్హుడే” దండించే అధికారమున్న వ్యక్తి సమయమాసన్నమైతే, దోషిని తప్పకుండా దండించితీరడమే కర్తవ్యం. అప్పుడు బంధుత్వాన్ని, హింసనూ తలవతగదు. రోగిని శస్త్రచికిత్స ద్వారా బాగుచేయవలసిన వైద్యుడు, శరీరాన్ని కోయడం, కుట్టడం వంటి పనులు చేయక తప్పదు కదా! వాటిని హింస అనలేము గదా! అదే అవసరం కూడా. ధర్మయుద్ధంలో జరిపే హింస గూడా అలాంటిదే అనే విషయం అర్జునుడు గుర్తించలేదు. కింకర్తవ్యతామూఢుడైన అర్జునుడికి కర్తవ్యాన్ని బోధించడానికి అన్నట్లు, లోకులందరికీ, నిత్యజీవన సమయంలో ఏ పని చేయాలో, ఏది మానాలో నిర్ణయించుకోలేని సందిగ్ధ పరిస్థితి ఏర్పడ్డప్పుడు కర్తవ్యబోధ చేసే అద్భుతమైన ఉపదేశంగ శ్రీ కృష్ణుడు అందించిన సందేశమే “భగవద్గీత”. విషాదంలో, పడి కర్తవ్యాన్ని గుర్తిచలేని మనిషికి, విశ్వసించి ఆశ్రయిస్తే, కర్తవ్యాన్ని ఆదేశించి దిశానిర్దేశం చేయగలిగిన, విజయపథంలో నడపగలిగిన ఉత్తమోత్తమమైన గ్రంథమే భగవద్గీత. యుద్ధ క్ష్రేత్రాన ఆవిర్భవించిన మహోపదేశమన్న మాట.



18 అధ్యాయాలుగా లభించిన ఈ మహోపదేశంలో 700 శ్లోకాలున్నాయి. ప్రతి అధ్యాయానికి ఏదో ఒక “...యోగః” అని పేరు. యోగమనే పదానికెన్నో అర్థాలున్నా, భగవద్గీతలోని అధ్యాయాల విషయానికి వస్తే ఉపాయము, సాధనము, మార్గము అనే అర్థాలు చెప్తారు ప్రామాణికులైన పెద్దలు. అంటే ప్రతీ అధ్యాయము గూడ ఆయా పేరు కల్గిన కర్తవ్యాన్ని తెలిపే ఒక్కొక్క సాధనమన్నమాట. శ్రీ కృష్ణుని ఉపదేశం విన్న అర్జునుడు తెలివి తెచ్చుకొని కర్తవ్యపాలనం చేసాడు. ఇక యుద్ధమారంభమైంది. సంజయుడికి దివ్యదృష్టిని యిప్పించినా, 10 దినాల దాక ధృతరాష్ర్టుడికి ఏమీ అడగాలని అనిపించలేదు. హఠాత్తుగా, 11వ దినాన భీష్మాచార్యుడు యుద్ధరంగంలో కుప్పకూలిపోయాడనే సమాచారం చేరింది. దాంతో, కృంగిపోయిన ధృతరాష్ర్టుడు సంజయుణ్ణి పిలిచాడు. “అసలేం జరిగిందయ్యా. మా వాళ్ళకీ, పాండవులుకీ కూడా భీష్ముడంటే అపరిమితమైన గౌరవం ఉందిగద! మరి వీళ్ళందరూ ఉంటూండగ ఆయనెలా పడిపోయాడు... ఏం చేస్తున్నారు వీళ్ళంతా... “అని ప్రశ్నించాడు. దివ్యదృష్టితో చూచి జరిగినదంతా చెప్పాడు సంజయుడు. అందుకే ప్రశ్నలో యుద్ధరంగంలో పోరాడలనే చేరినవాళ్ళు ఎలా యుద్ధం చేసారయ్యా “...కథమకురుత?” అని అడగాలి కానీ “..కిమకుర్వత?” ఏమి చేసారయ్యా? అని అడగడం కుదరదు గద. అలానే యుద్ధారంభానికి ముందే, అంటే మార్గశిర మాసారంభంలోనే శ్రీ కృష్ణుడు గీతోపదేశం చేసి అర్జునుణ్ణి యుద్ధంలో ప్రవేశపెట్టాడు. అయినా, ఆ రోజున ఒక్క అర్జునుడు తప్ప మిగిలిన వాళ్ళెవ్వరూ దానిని వినలేదు. బహుశః వినగలిగే స్థితిలో ఉండి ఉండరు. ధృతరాష్ర్టుడి ప్రశ్నతో సంజయుడు 11వ దినాన దానిని ప్రకటించాకనే లోకానికి యుద్ధానికి ముందుగ ఆ ఉపదేశం జరిగిందన్న విషయం తెలిసింది. అందుకే మార్గశిర శుక్ల ఏకాదశిని గీతాజయన్తిగ పాటిస్తారు. ఆనాడు, 700 శ్లోకాల భగవద్గీతను పూర్తిగ పఠించగలగడం అదృష్టం. లేదా, ఈ చరిత్రను తలచుకొని కొన్ని శ్లోకాలను చదువగలిగినా కొంత భాగ్యమే కద. ఇలా ధృతరాష్ర్టుడి ప్రశ్నతో భగవద్గీత లోకానికందిందనే కృతజ్ఞతతో, ఆయన ప్రశ్నతోనే గీతాపారాయణను ప్రారంభిస్తారు. రండి! మరి మనమూ ప్రారంభిద్దాం!



జైశ్రీమన్నారాయణ

27 February, 2012

సంస్క్రతములో పట్టము సాధించిన సాయిఅన్నయ్య

సంస్క్రతములో పట్టము సాధించిన సాయిఅన్నయ్య




అంతర్జాలములో ఈ_గురుకులము వారు నిర్వహించిన సంస్క్రతములో నాలుగువారములు జరిపిన తరగతులకు

అంతర్జాలముద్వారా హాజరయి మీ మోడరేటర్ సాయి అన్నయ్య పట్టము సాధించిన సంగతి తెలియపరచు

ధృవపత్రము చూడగలరు.





21 February, 2012

చి.శ్రీకాంత్ భరద్వాజ్ నూతన గృహప్రవేశము

చి.శ్రీకాంత్ భరద్వాజ్ నూతన గృహప్రవేశము




చి.పార్ధసారధి తనయుడు,చి.శ్రీకాంత్ భరద్వాజ్ ది.15.02.2012 న చెన్నైలో నూతనముగా

ఒక అపార్టమెంట్ కొనుక్కుని, సంప్రదాయముగా తల్లిదండ్రులచే గృహప్రవేశము చేయించాడు. ఈ సందర్భముగా పెద్దనాన్నగారు, శ్రీ విశ్వనాధంగారు, ఆమ్మశ్రీమతిసీతమ్మగారు, చెల్లెలు స్వప్న,బావగారు చి.చక్రవర్తి, విచ్చేసి, శుభాభివందనములు తెలిపారు. కీసర వంశస్తులందరు,

చి.శ్రీకాంత్ భరద్వాజ్, చి.కృష్ణప్రియలకు, శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ విశేషముల ఛాయాచిత్రములు ఇక్కడ చూడవచ్చును.
 



30 January, 2012

బావగారూ! పదవీ విరమణ శుభాకాంక్షలు!! అందుకోండి

బావగారూ! పదవీ విరమణ శుభాకాంక్షలు!! అందుకోండి






ఖమ్మంజిల్లా పరిషత్ లో 32 ఏళ్ళు పనిచేసి నేడు పదవీ విరమణ చేస్తున్న

శ్రీ అల్లూరు సీతారామారావు B.A., B.Ed., కు శుభాభివందనములు.

మీరు విరామసమయము మీకు అత్యంత ఇష్టమైన "సంఘసేవ"లో గడుపుతూ

ఇలాగే ఆదర్శవంతమైన జీవితము గడపాలని ఆకాంక్షిస్తూ,



కీసరవంశస్తులు.

CHY.ALLURU SEETHA RAMA RAO RETIRES TO-DAY AFTER A GLORIOUS SERVICE

CHY.ALLURU SEETHA RAMA RAO, THE FIFTH SON-IN-LAW OF LATE SHRI KVR NARASIMHA RAO, RETIRES TO-DAY FROM KHAMMAM ZILLA PARISHAD AS SENIOR GRADE TELUGU PANDIT.

WE WISH HIM A HAPPY RETIRED LIFE.

ALL THE KEESARA VAMSASTULU PRESENT HIM THIS VIDEO AS A SWEET MEMORAY

28 January, 2012

సాధనలో భక్తిశ్రద్ధల ఆవశ్యకత

సాధనలో భక్తిశ్రద్ధల ఆవశ్యకత




ఒక దేవాలయప్రాంగణములో ఓ సన్యాసి భగవత్తత్వముగూర్చి భక్తులనుద్దేశించి ప్రసంగింస్తూంటుంటే ఆ ప్రసంగములను అదే దేవాలయము బయటకూర్చుని భిక్షాటనము చేసే ముదుసలి అత్యంత శ్రద్ధగా వింటూ వుండేది. ఆయన ప్రసంగములు ముగించి వేరే ప్రదేశమునకు బయలుదేరే రోజున ఈముదుసలి ఆయనవద్దకు వెళ్ళి, " ఓ మహనీయా! నాకు వయసు అయిపోతున్నది. మీరు చెప్పే మాటలన్నీ విని నేను ఆ భగవంతుని ప్రార్ధించదలచుకున్నాను. ఆ భగవంతుని ప్రార్ధన చేయటానికి నాకు మంత్రమేదైనా దయచేసి ఇప్పించండి" అని ఆయన పాదాలమీదపడి కన్నీళ్ళు పెట్టుకుంది. సన్యాసి ఆ ముదుసలికి "హే ప్రభూ !తవ పాదయే మమ శిర్ ధారయేత్, ప్రసన్న ప్రసన్న శ్రీఘ్రహ్" అని స్మరిస్తుండమన్నాడు. ఆ ముదుసలి అత్యంత భక్తిశ్రద్ధలతో ఆయన చెప్పినదానిని ఎల్లవేళలా స్మరిస్తువున్నది. ఇలా ఓపది ఏళ్ళుగడిచాయి. మళ్ళీ సన్యాసి ఆ దేవాలయమునకు విచ్చేశాడు. ఆయన ఈ ముదుసలిని చూసి గుర్తుపట్టి " ఏం అవ్వా! నేను చెప్పినదానిని స్మరిస్తున్నావా?" అనడిగాడు. అందుకావ్వ తలాడించింది. "ఏది పాఠం వప్పచెప్పు" అన్నాడాయన. ఆ ముదుసలి పదేళ్ళుగా తను స్మరిస్తున్న మంత్రమును ఆ సన్యాసి ముందుంచింది. అందుకాయన "అయ్యో! అవ్వా! తప్పు! తప్పు! నేను చెప్పినదొకటి నువ్వుచేస్తున్నదొకటి. నేను ఆయన పాదలమీద నీశిరస్సుపెట్టమంటే, నువ్వు ఆ భగవంతుని శిరస్సున నీపాదాలు పెట్టావు. నువ్వు చేస్తున్నదంతా వ్యర్ధమయ్యింది" అని ఆగ్రహమువెళ్ళగక్కి, తన నివాసానికి వెళ్ళిపోయాడు. ఇంతకూ జరిగినదేమిటంటే రోజూ స్మరిస్తూంటుంటే "తవ" "మమ" అనే పదాలు అటూఇటూ అయ్యాయి. దాంతో అర్ధము మారిపోయింది.

ఆయన చెప్పినదంతావిని ఆఅవ్వ తనుచేసిన పదేళ్ళశ్రమ వ్యర్ధమయినదని తెలుసుకొని అన్నాహారాలుమాని దు:ఖించసాగింది.

వైకుంఠములో శ్రీస్వామివారు ఈభక్తురాలి ఆర్తికి కరిగిపోయి ఆ సన్యాసి స్వప్నమందు కనిపించి, " ఓయీ! నీవు చెప్పిన మాటలకు

ఆ భక్తురాలు హతాశురాలయినది. నేను భక్తిశ్రద్ధలకు బద్ధుడనుకానీ, మంత్రములకు కాదు కదా! ఆ భక్తురాలు అన్నాహారాలుమానివేయడముతో, నాకు ఎంతమంది ఎన్ని నైవేద్యములు పెట్టినా, ఆకలితీరుటలేదు. ముందు నీవుపోయి

ఆభక్తురాలి అన్నపానీయములు విషయము చూడు" అని పలికాడు. ఆ సన్యాసి ఉలిక్కిపడి ఆ భక్తురాలి వద్దకువెళ్ళి ఆవిడ పాదాలమీదపడి, "తల్లీ నా అజ్ఞానాన్ని మన్నించు ! నీవు చేసే పూజయే ఆ భగవంతునికి ఇష్టమయ్యింది. నీ జన్మ సార్ధకమయ్యింది," అని ఆవిడని శతవిధముల వేడుకొని, ఆ భక్తురాలిని సేదతీర్చి ఈ వుదంతమును తన నాటి ప్రసంగములో ఉదహరించి, ఆభక్తురాలిని కొనియాడి, సాధకులకు భక్తిశ్రద్ధలు ఎంత ముఖ్యమో తెలియచెప్పాడు.

ఈ వృత్తాంతములో భక్తిశ్రద్ధలు ఎంత అవసరమొననికానీ, ఉచ్చారణదోషములు లేకుండా చూచుకొనవలెనని సాధకులు గమనించవలసినది.

18 January, 2012

చిరంజీవి హర్షిత పుట్టినరోజు వేడుకలు

చి!!చైతన్య,చి!!సౌమ్యల ప్రధమచిరంజీవి హర్షిత పుట్టినరోజు వేడుకలు ది.14.01.2012 న హైదరాబాద్ లో మాక్డొనాల్డ్ రెస్టారెంట్  లో ఘనంగా జరిగినవి.  చి!హర్షితకు కీసరవంశస్తులందరి శుభాశ్శీసులు. ఈసందర్భముగా జరిగిన వేడుకలకు పితామహులు, మాతామహులు,ఇతర బంధుమిత్రులు ఉత్సహముగా  పాల్గొని ఆనందించారు. వేడుకలు సంధర్భముగా తీసిన చాయ చిత్రములకు ఈ లంకె నొక్కండి. 

http://wwwkeesaravamsamblogspotcom.shutterfly.com/
 

14 January, 2012

మకర సంక్రాంతి శుభాకాంక్షలు.


య ఏవ యత్నః క్రియతే బాహ్యార్థోపార్జనే జనైః !

స ఏవ యత్నః కర్తవ్యః పూర్వం ప్రజ్ఞావివర్ధనే  !!

(యోగ వాసిష్ఠం-ఉపశమ ప్రకరణమ్)

(భావం : బాహ్య వస్తువులను, విషయములను సంపాదించటంలో ఎంతటి ప్రయత్నం చేస్తూంటామో, అంతటి ప్రయత్నాన్నే ముందుగా మన ప్రజ్ఞను వృద్ధి చేసుకోవటంలో చేయాలి. జఠరాగ్ని సమంగా ప్రజ్వరిల్లుతున్నప్పుడే గదా పంచ భక్ష్య పరమాన్నాలను ఆస్వాదించి, ఆనందించ గలిగేది ! పిల్లలను అత్యున్నత విద్యా శాస్త్రాలలో చేర్పించేముందే, వారిలో సృజనాత్మకతను, విజ్ఞానాన్ని సమాజహిత సత్ప్రయోజనాలకొరకే వినియోగించే సద్బుద్ధిని పాదుకొల్పాలి గదా !)

ఈ మకర సంక్రాంతి  శుభ సందర్భమున,

పైన ఇచ్చినటువంటి ఆణిముత్యాలను వేలకొలది అందంగా అమర్చిన కిరీటమానమైన శ్రీమద్రామాయణ, యోగవాసిష్ఠ గ్రంథద్వయమును మన భారతజాతికి అందించిన ఆదికవి శ్రీవాల్మీకిమహర్షియొక్క దివ్యాశీస్సులు మనందరిపై వర్షించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ,

సాయి సాలగ్రామ నరసింహ శర్మ

11 January, 2012

మనో నిగ్రహం

మనో నిగ్రహం


ప్రశ్న :

ఏ పద్ధతిని - ఏ మార్గాన సాధన చేసినా మనసు ను వశం చేసుకోవాలని చూస్తారు. దాన్ని నిగ్రహించమని చెపుతారు. ఒకవైపున మనసు ఒక తెలియని వ్యక్తిగా - మరొక వైపున తనకు అనేకమైన వ్యవహారిక బాధలు, గొడవలు వుండగా - మనం నిజంగా మనో నిగ్రహం సాధించ గలమా?

సమాధానం:

సముద్రం ఎప్పుడూ చూడని ఒకాయన దాన్ని చూసి తెలుసుకోవడానికి దాని దగ్గరకు వెళ్ళాడు. ఆ విశాల జల రాశి ముందు నిలిచి అందు స్నానం చేయాలని అనుకొన్నాడు. ఆ తీరాన నిలిచి చలించి, ఘోషిస్తున్నట్టి ఆ తరంగాల్ని చూసి "ఈ అలలన్నీ అణిగినప్పుడు ఇంటి వెనక చెరువు లో స్నానం చేసినట్లు - సముద్రం లో దిగి స్నానం చేస్తాను" అనుకున్నాడు.

సముద్రం నిరంతరం అలసట లేకుండా తరంగాలతో సృస్టి మొదటినుంచి, ప్రళయం వరకు ఆవిధంగా చలిస్తూ వుంటుందనే సంగతి ఇతరులు చెప్పడం వల్లగాని, లేదా - తనకు తానుగా తెలుసుకోవడం వల్ల గాని విషయం గ్రహించ వలసి వుంది.


అతడా విషయం తెలుసుకున్న తర్వాత అతడా సముద్రం లో దిగి స్నానం చేస్తాడు. అతడు చేతులు మెల్ల మెల్ల గా వూపుతూ, గత సూచనల ద్వారా ఆ తరంగాలలో మునుగుతూ తన తలపై నించి తరంగాలను పోనిస్తాడు. అతడు శ్వాసను సహజంగా బంధిస్తాడు. అట్లా చేయడం వలన అతడు నేర్పరి అవుతాడు. చివరకి తన లక్ష్యాన్ని సాధిస్తాడు - ఎటువంటి దుఃఖం బాధ కష్టం కలగకుండా.


సముద్రం చలిస్తూ ఉన్నా అతడు దాని బంధం నుండి విముక్తుడు అవుతాడు. "మనస్సు విషయం లో కూడా అంతే".



భగవాన్ రమణ మహర్షి (100 ప్రశ్నలకు రమణ మహర్షి సమాధానాలు నుంచి)

31 December, 2011

కీసర వంశస్తులందరికీ  2012  నూతన సంవత్సర శుభాకాంక్షలు .



                                  కీసర  వంశస్తులందరికీ 2012 నూతన  సంవత్సర శుభాకాంక్షలు .
















చి!!చైతన్య కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.ఆయూరారోగ్య ఐశ్వర్యమస్తు.



                    చి!!చైతన్య కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.ఆయూరారోగ్య ఐశ్వర్యమస్తు.

                                                                
                                                      For A Great Person Inside And Out!Big Hug From Me!

30 December, 2011

వాతాపి గణపతిం భజే: గణపతి పై అంత అందమైన కృతి ఎలా అయింది?

 
 
 
 
కర్ణాటక సంగీత త్రయంలో ఒకరైన శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ గారు తిరువారూరులో జన్మించారు. అలనాటి వాతాపి (ఇప్పటి బాదామి) నుండి గణపతి విగ్రహాన్ని పల్లవులు చాళుక్యుల పై సాధించిన విజయానికి ప్రతీకగా తిరువారూరు తరలించి అచట ప్రతిష్టించారని చరిత్ర కథనం. ముత్తుస్వామి గారు షోడశ (పదహారు) గణపతి కృతులను వ్రాసారు. అందులో ఒకటి హంసధ్వని రాగంలో బాణీ కట్టిన "వాతాపి గణపతిం భజే".ఈ రాగం యొక్క సృజన కర్త ముత్తుస్వామి గారి తండ్రి గారైన శ్రీ రామస్వామి దీక్షితార్ గారు. ఈ కృతి యొక్క ప్రతి పదార్ధము, తాత్పర్యము, వివరణ దిగువన చూడగలరు.





 
 
పల్లవి


వాతాపి గణ పతిం భజే(అ)హం వారణాస్యం వరప్రదం శ్రీ



వాతాపి = బాదామి; గణపతిం = గణపతిని; భజే = భజించెదను; అహం = నేను (శ్రీ దీక్షితార్); వారణ = ఏనుగు; ఆస్యం = ముఖము; వర = వరములు; ప్రదం = ఇచ్చువాడు.



అనుపల్లవి



భూతాది సంసేవిత చరణం భూత భౌతిక ప్రపంచ భరణం

(మధ్యమ కాల సాహిత్యమ్)

వీత రాగిణం వినత యోగినం విశ్వ కారణం విఘ్న వారణం







భూతాది = పంచ భూతములు మొదలైన ; సంసేవిత = సేవించబడే; చరణం = పాదములు; భూత = ఆత్మలకు, గతించిన వారికి (వాటికి); భౌతిక = ఇహలోకులయిన జీవులకు; ప్రపంచ = జగత్తున; భరణం = వ్యాపించి యున్న; రాగిణం = విషయ వాంఛలకు; వీత = అతీతుడై ; వినత = స్తుతించ బడు; యోగినం = యోగులచే; విశ్వ = ప్రపంచము లేక జగత్తు; కారణం = కారణమైన వాడు, విఘ్న=అడ్డంకులు; వారణం = వారింప జేయువాడు, తొలగింప జేయువాడు.





చరణమ్

పురా కుంభసంభవ మునివర ప్రపూజితం త్రికోణ* మధ్యగతమ్

మురారి ప్రముఖాద్యుపాసితం మూలాధార క్షేత్ర స్థితమ్

పరాది చత్వారి వాగాత్మకం ప్రణవ స్వరూప వక్ర తుండమ్

నిరంతరం నిటల* చంద్ర ఖండం నిజ వామకర విధృతేక్షు దండమ్



పురా = మునుపటి / ప్రాచీన; కుంభ = కుండ; సంభవ = జన్మించిన; కుంభ-సంభవ = కుండలో పుట్టినవాడు - అగస్త్యుడు; మునివర = ముని శ్రేష్టుడు; ప్రపూజితం = పూజించబడిన; త్రికోణ = త్రిభుజము యొక్క మూడు కోణముల; మధ్యగతం = నడుమ నివసించు; మురారి (ముర + అరి) = ముర అను రాక్షస శత్రువును హరించిన లేక సంహరించినవాడు - విష్ణువు; ప్రముఖ = ప్రసిద్ధులైన; ఉపాసితం = కొలువబడిన; మూలాధార = మూలాధార చక్రం; క్షేత్ర = స్థానం; స్థితం = స్థిరమైన.





పరాది = పర మొదలయిన; చత్వారి = నాలుగు; పరాది చత్వారి = పర, పశ్యన్తి, మధ్యమ, వైఖరి, అనేవి 'ద్వని' కి గల నాలుగు పౌనః పున్యాలు (frequencies) అని శాస్త్రాలు చెబుతున్నాయి; వాగాత్మకం = వాక్ + ఆత్మకం = శబ్ద జనితమైన; ప్రణవ = ఓంకార ; స్వరూప = రూపమైన; వక్ర = వంపు తిరిగిన; తుండం = తొండము గల; నిరంతరం = ఎల్లప్పుడూ; నిటల* = నుదుట; చంద్ర = చంద్రుని; ఖండం = తునక = చంద్రకళ; నిజ = తన; వామ = ఎడమ; కర = చేయి; విదృత = బలమైన; ఇక్షు = చెరకు; దండం = గడ, కర్ర.



(మధ్యమ కాల సాహిత్యమ్)



కరాంబుజపాశ బీజాపూరం కలుష విదూరం భూతాకారమ్

హరాది గురు గుహ తోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబమ్





కరాంబుజపాశ = కర + అంబుజ + పాశ; కర = చేత, చేతిలో + అంబుజ = అంబు అంటే నీరు, జ అంటే పుట్టిన, - నీటిలో పుట్టినది, అనగా పద్మము + పాశ = పాశము; బీజాపూరం = దానిమ్మపండు; కలుష = మలినము; విదూరం = మిక్కిలి దూరం చేసేది; భూత = పెద్దదైన; ఆకారం = రూపం; హరాది = హరుడు మొదలగు వారు; గురుగుహ = షణ్ముఖుడు; ఇది కృతిలో రచయితయైన ముత్తుస్వామి గారి ముద్ర లేదా సంతకం; తోషిత = కొలువబడిన; బింబం = రూపం; హంసధ్వని = కర్నాటక సంగీతంలో ఒక రాగం; భూషిత = అలంకరించబడిన; హేరంబం = అంబకు, అంటే అమ్మకు ప్రియమైన వాడు అనగా వినాయకుడు. హేరంబ అనేది వినాయకుని మరొక పేరు.



తాత్పర్యం: కృతి కర్త యైన శ్రీ ముత్తు స్వామి దీక్షితార్ గారు ఇలా అంటున్నారు: నేను వాతాపి గణపతిని పూజించుచున్నాను. గజ ముఖుడైన, వరాలను ఇచ్చే గణపతిని పూజించుచున్నాను. విషయ వాంఛలకు అతీతమై, యోగులచే కొలువబడి, జగత్కారణమై, అడ్డంకులను తొలగించే గణపతి పాదములను ఈ జగత్తున వ్యాపించి యున్న సమస్త భూతములు, ఆత్మలు, జీవాత్మలు సేవించుకొనును.





మూలాధార చక్ర స్థానం లో స్థిరమై, అందున్న త్రికోణపు మధ్య గల స్థానమందు వసించు గణపతీ! నిన్ను మునుపటి అగస్త్యుల వంటి ముని శ్రేష్ఠులు, విష్ణువు మొదలయిన ప్రసిద్ధులైన దేవతలు పూజిస్తారు. పర మొదలయిన నాలుగు విధములైన శబ్దములతో కూడి జనించిన ప్రణవ నాదమైన ఓంకారము వలె నీ వంపు తిరిగిన తొండము గోచరిస్తోంది. నీవెల్లప్పుడు ఫాలభాగమున చంద్రకళను ధరించి, నీ ఎడమచేత బలమైన చెరకుగడను దాల్చి అగుపిస్తావు. అంతే కాక తల్లియైన పార్వతికి ప్రియ పుత్రుడవైన నీవు చేతులలో పద్మము, పాశము, దానిమ్మ పండు ధరించి, భక్తుల పాపాలను తొలగిస్తావు. శివుడు, షణ్ముఖుడు, మొదలయినవారిచే కొలువబడి హంసధ్వని రాగాన్ని భూషణంగా, అమ్మ అయిన పార్వతికి ప్రియ పుత్రునిగా గణపతీ నీవు ఒప్పుచున్నావు.





ఈ కృతిలోని సొగసులు: ఈ కృతిలో శ్రీ దీక్షితారు గారు అందంగా ఆద్యక్షర ప్రాసను పల్లవిలో (ఉదా. వాతాపి, వారణాస్యం, వరప్రదం), అనుపల్లవిలో (ఉదా. భూతాది, భూతభౌతిక; అలాగే వీత, వినుత, విఘ్న, విశ్వ మొదలయినవి) వాడారు. అలాగే ద్వితీయాక్షర ప్రాస (పురా, మురా, పరా, నిర, కరా, హరా) మరియు అంత్యాక్షరప్రాస (చరణం, భరణం, రాగిణం, యోగినం, కారణం, వారణం; అలాగే తుండం, ఖండం, దండం మొదలయినవి). ఇవికాక, భూత అనే పదాన్ని మూడు చోట్ల మూడు అర్ధాలతో వాడారు - భూతాది, భూత-భౌతిక, భూతాకారం. అంతే కాక, తన వాగ్గేయకార ముద్ర అయిన 'గురుగుహ' ను, రాగం పేరైన 'హంస ధ్వని'ని కృతి సాహిత్యం లో నిక్షిప్తం చేసారు శ్రీ దీక్షితార్ గారు. ఈ కారణాల వలన ఈ కృతి ఇంత సుందరంగా ఉంటుంది.



* శ్రీ ఘంటసాల మాస్టారు వినాయక చవితి చిత్రంకోసం పాడిన 'వాతాపి గణపతిం భజే' సాహిత్యం లో "త్రికోణ" కు బదులు "త్రిభువన" అని, "నిటల" కు బదులు "నిఖిల" అని వుంది. అయితే చాల వెబ్ సైట్లు చూసాక, ముఖ్యంగా దీక్షితార్ గారి కి సంబంధించిన 'గురుగుహ' సైట్ ను కలిపి, మరియు ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులైన శ్రీమతి సుబ్బ లక్ష్మి, శ్రీ బాలమురళీ కృష్ణ గార్ల వీడియోలలో పైన ఇచ్చిన సాహిత్యం తో సరిపోయాయి. అందువలన ఆ ప్రాతిపదికన సాహిత్యాన్ని ఇక్కడ పొందు పరచడం జరిగింది.

28 December, 2011

జగదీశ్వరి స్వప్న మధుర మీనాక్షి

                                          జగదీశ్వరి స్వప్న మధుర మీనాక్షి ఆలయము వద్ద


                                                 
                          
                             మేము మధుర మీనాక్షి ఆలయమునకు వెళ్ళినప్పుడు అమ్మవారి చెంత
                               చి!! జగదీశ్వరి   చి!!   స్వప్న కలసి తీయించుకున్న ఛాయాచిత్రము

25 December, 2011

మంగళ శ్లోకం - సర్వ మంగళ మాంగళ్యే

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే

ప్రతి పదార్థము: సర్వమంగళ మాంగళ్యే = శుభకరమైన వాటన్నింట శుభకరమైనది /మంగళకరమైనది (సర్వమంగళ నామము చేత మంగళ స్వరూపురాలైనది); శివే = శివ సతి అయిన శక్తి లేదా పార్వతి; సర్వ = అన్ని; అర్థ = అర్థములను (ధర్మ+అర్థ+కామ+మోక్ష అను చతుర్విధ పురుషార్థములు); సాధికే = సాధించినది; శరణ్యే = శరణము/ఆశ్రయము కల్పించేది; త్రంబకి = త్రి + అంబకి = మూడు కన్నులు గలవాని దేవేరి, అనగా పార్వతి; దేవి = దేవి/దేవత; నారాయణి = పార్వతి; తే = నీకు; నమః = నమస్కారము/ప్రణామము; అస్తు = అగు గాక.

తాత్పర్యము: మంగళ కరమైన వాటన్నిటిలోనూ అతి మంగళకరమై, సర్వ మంగళ నామధేయురాలవై, అన్ని అర్థములను సాధించి, శరణు జొచ్చిన వారికి ఆశ్రయమిచ్చే, ముక్కంటి దేవర అయిన శివుని అర్ధాంగి అయిన ఓ! పార్వతీ, ఓ! దుర్గాదేవీ, ఓ! నారాయణీ, నీకు నమస్కరిస్తున్నాను.

13 December, 2011

నిర్వాణ షట్కము

                                    
                                        ఆది శంకరాచార్య కృత నిర్వాణ షట్కము







జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు ఒకసారి హిమాలయ ప్రాంతంలో సరియైన గురువు కోసం అన్వేషిస్తుండగా ఒక సన్యాసి ఎదురొచ్చి, "నువ్వు ఎవరివి?" అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా శ్రీ ఆది శంకరులవారు మొత్తం అద్వైత వేదాంతాన్ని ఆరు శ్లోకాల రూపంలో "నిర్వాణ షట్కము" గా పలికారట. ఇది తను (అహం) అనుకునే ఆత్మ వివరణ కనుక దీనినే "ఆత్మ షట్కము" అని కూడా అంటారు. నిర్వాణం అంటే సంపూర్ణ సమదృష్టి, ప్రశాంతత, స్వేచ్చ, ఆనందము (సత్+చిత్+ఆనందం = సచ్చిదానందం) మిళితమైన ఒక అచేతన స్థితి. అదే సచ్చిదానందం.
               

శివోహమ్ శివోహమ్ శివోహమ్


1. మనో బుద్ధ్యహంకార చిత్తాని నాహమ్

న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే

న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయుః

చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ (2)

శివోహమ్ శివోహమ్ శివోహమ్



2. న చ ప్రాణ సంజ్ఞో న వై పంచ వాయుః

న వా సప్త ధాతుర్ న వా పంచ కోశః

న వాక్ పాణి పాదం న చోపస్థ పాయు

చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ (2)

శివోహమ్ శివోహమ్ శివోహమ్





3. న మే ద్వేష రాగౌ న మే లోభ మోహౌ

మదో నైవ మే నైవ మాత్సర్య భావః

న ధర్మో న చార్థో న కామో న మోక్షః

చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ (2)

శివోహమ్ శివోహమ్ శివోహమ్





4. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఖఃమ్

న మంత్రో న తీర్థ న వేదా న యజ్ఞః

అహమ్ భోజనమ్ నైవ భొజ్యమ్ న భోక్త

చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ (2)

శివోహమ్ శివోహమ్ శివోహమ్



5. న మే మృత్యు శంకా న మే జాతి భేదః

పితా నైవ మే నైవ మాతా న జన్మః

న బంధుర్ న మిత్రం గురుర్ నైవ శిష్యః

చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ (2)

శివోహమ్ శివోహమ్ శివోహమ్



6. అహం నిర్వికల్పో నిరాకార రూపో

విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణాం

న చాసంగత నైవ ముక్తిర్ న మేయః

చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ (2)

శివోహమ్ శివోహమ్ శివోహమ్

30 November, 2011

మా తొమ్మిదవ తిరుమల (దశవర్ష పధకములో)యాత్ర



మేము తిరుమల తిరుపతి దేవస్థానమువారి దశవర్ష పధకములో తొమ్మిదవ సంవత్సరము శ్రీపద్మావతీసమేత శ్రీశ్రీనివాసుని ఈనెల ౨౩, ౨౪ న శ్రీవారిని కుటుంబసమేతముగా సేవించుకున్నాము. ఈ సందర్భమున నేను చాలా సన్నివేశములు చిత్రీకరించటము జరిగినది. (కుటుంబసభ్యుల గ్రూపు మినహా) . కొన్ని మీకోసం.





19 November, 2011

CHY.SWARNA MANJARI EXCLUSIVE

These are the exclusive photographs of Chy.Swarna Manjari taken by me just before start of  our 9th  Annual Dasavarsha Pilgrimage to Tirumala Tirupati.  We will celebrate 2nd  Kesa Kandanam function to her at Tirumala.  So, have a look at Chy.Swarna Manjari with long curling Alakalu.







కీసర వంశము***** KEESARAVAMSAM