06 March, 2013

పవిత్ర మహాకుంభమేళా - నందన మాఘము 2013

పవిత్ర మహాకుంభమేళా సందర్భమున నేను త్రివేణి సంగమమున ప్రితృదేవతలకు
యధావిధిగా కర్మలను ఆచరించి వచ్చాను. ఈ యజ్ఞములో నా ధర్మపత్ని జగదీశ్వరి తనవంతు ధర్మములు నెరవేర్చటముతో పాటు, "వేణీదానము" కూడా చేసి కార్యక్రమము సుసంపన్నము చేసినది. ఈ కార్యక్రమము యావత్తు శ్రీ మనోహర్ శాస్త్రి పురాణిక్ గారి ఆధ్వర్యములో జరిగినది. వారు ఈ మహాకుంభమేళా స్నానము, తదుపరి కార్యక్రమములకు పితృదేవతల ఆశ్శీసులతో పాటు భగవంతుని అనుగ్రహము ఉండవలెనని తమ ఆశ్శీపూర్వకవాచకములో చెప్పారు.

ఈ యాత్రలో భాగంగా అష్టాదశపీఠములలో ఒకటైన "శ్రీమాధవేశ్వరీమాత" "ఆలోపీ మహేశ్వరీ" పీఠదర్శనము, మహావటవృక్షము, హనుమాన్ దేవాలయము, శంకరవిమాన మండపము, భారద్వాజ ఆశ్రమము చూడటం మా భాగ్యంగా తలుస్తున్నాము.

దీనికి సంబంధించిన ఛాయాచిత్రములు చూచుటకు ఈ లంకె నొక్కండి.

https://plus.google.com/photos/105802903792469439891/albums/5852153727535228145?authkey=CLq9__WQxMSN1gE#photos/105802903792469439891/albums/5852153727535228145

శ్రీకృష్ణార్పమస్తు.

వేణీదానము

మా త్రివేణీ సంగమ (ప్రయాగ) యాత్రలో చిరంజీవి    జగదీశ్వరి  "వేణీదానము" చేసినది.


దానిలో భాగంగా పతి ధర్మపత్నికి దానమునకు ముందు "వేణి" కూర్చుతున్న దృశ్యము.



                  

కీసర వంశము***** KEESARAVAMSAM