28 August, 2012

చిరంజీవి భరద్వాజ్ కుమార్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

పూనాలో ఈ రోజు పుట్టినరోజు పండుగ జరుపుకుంటున్న చిరంజీవి భరద్వాజ్ కుమార్ కు


                       కీసర వంశస్థులందరి తరఫున "పుట్టిన రోజు శుభాకాంక్షలు" తెలుపుతున్నాము.


26 August, 2012

నీల్ ఆమ్ స్ట్రాంగ్ - మా నాయనమ్మ

నీల్ ఆమ్ స్ట్రాంగ్ - మా నాయనమ్మ



నీల్ ఆమ్ స్ట్రాంగ్ - చందమామ మీద కాలు పెట్టిన మొదటి మానవుడు చనిపోయాడని తెలిసి బాధపడని మానవుడుండడు. 1969 జులై 20న అందరిలాగే నందిగామలో రాత్రి దాదాపు భారతీయ కాలమానము ప్రకారం అర్ధరాత్రి వాయిస్ ఆఫ్ అమెరికా నుండి వ్యాఖ్యానము వింటూ ఏదో తెలియని ఆనందములో తేలిపోయాను. ఆ వార్త, ఆ ఆనందము పంచుకోవటానికి ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు. మా నాయనమ్మ గదిలోనుండి ఏదో శబ్ధము అయితే గదిలోకి తొంగి చూశాను. ఆవిడ మంచినీళ్ళకోసం లేచింది. ఆవిడ నీళ్ళు తాగేంతవరకు ఆగి, "నాయనమ్మా! మనిషి చందమామ మీద అడుగుపెట్టాడు" అని ఆవిడకు ఆ వార్త అందించి ఆవిడ కాళ్ళకు నమస్కరించాను. ఆవిడకు వయస్సు 82 ఏళ్ళు. వార్త ప్రాముఖ్యము ఆవిడకు అర్ధమయ్యిందో లేదో నాకు తెలియలేదుకాని, " మీ తాతయ్య గారు ఉంటే బాగుండేదిరా" అంటూ కళ్ళు వత్తుకుంది.

24 August, 2012

శ్రీ హనుమంతుని వేదాంతం కధ


శ్రీ హనుమంతుని వేదాంతం కధ

ఒక రోజు శ్రీ రాముడు హను మంతుని దగ్గరికి పిలిచి ”హనుమా !నేను చెప్పిన వేదాంత విషయాలన్నీ విన్నావు కదా .దేహ ,జీవ ,పరమాత్మ లకు సమన్వయము చేస్తూ చెప్పు ”అని కోరాడు .అదే శిరో ధార్యం గా భావించిన పరమ భక్త శిఖా మణి మారుతి ”శ్రీ రామా !వేదాంత రహస్యము తెలిసిన తరు వాత కూడా ఈ దేహం ఉన్నంత వరకు దేహాన్ని ,జీవుణ్ణి ,పరమాత్మ ను వేరు వేరు గా నే భావించాలి .దేహ దృష్టి తో పరమేశ్వరుని ధ్యానిస్తూ ,సేవించాలి .అన్ని భావాలను త్యజించి ,శరణా గతి పొందాలి .ఇతరులకు ఉపకారం చేస్తూ ,వారు కూడా భగవంతుని స్వరూపం గా భావించి ,సేవించాలి .ఇలాంటి దానినే భక్తి లక్షణం అంటారు .ఇదే విశిష్టాద్వైత సిద్ధాంతం .జీవుడు వేరు ,పరమాత్మ వేరు అని భావిస్తూ ,భగవంతుని స్మరిస్తూ , ,భగవంతుని పూజలు చేస్తూ ,భగ వంతుని మూర్తులను చూసి ఆనందిస్తూఉండటానికి ద్వైతం అంటారు .జీవుడు ,పరమాత్మ ఒక్కరే .ఎందు లోను భేదం అనేది లేదు అని భావన లో ,ఆచరణ లో చూపించటం జ్ఞాన లేక ,విజ్ఞాన లక్షణం అంటారు .ఇదే అద్వైత భావన .–”దేహ బుధ్యాతు దాసోహం ,జీవ బుద్ధ్యాతు త్వదంశః –ఆత్మా బుధ్యాతు త్వమేవాహం ఇతి మే నిశ్చితా మతిహ్ ” –రామా ! దేహ దృష్టి లో నేను నీకు దాసుడిని .జీవ దృష్టి లో నీవు పరమాత్మవు .నీ అంశ చేత నేను జీవ స్వరూపుడను .పరమాత్మ దృష్టి లో ”నీవే నేను -నేనే నీవు ”.ఈ మూడు లక్ష ణాలు నాలోనూ ,నీలోను ఉన్నాయి .ఇంక భేదానికి అవకాశమే లేదు .”అని స్పష్ట పరచాడు హనుమ .అంజనా నందనుడి సమాధానం విని పరమానంద భరితు డయాడు దాశరధి .”త్వమేవాహం ,త్వమేవాహం ”అని చాలా సార్లు హనుమ ను అభి నందించాడు .

”యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః –యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః –శ్రీ మారుతిత్సేవన తత్పరాణాం –భోగశ్చ ,మోక్షశ్చ ,కరస్త యేవ ”–అంటే ఎక్కడ భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు .ఎక్కడ మోక్షం ఉంటుందో అక్కడ భోగానికి అవకాశమే లేదు .కాని శ్రీ హనుమ సేవా తత్పరు లైన వారికి భోగమూ ,మోక్షమూ రెండు తప్పక లభిస్తాయి అని శ్రీ రాముడు ”వరం ”అను గ్రహించాడు .దానికి వెంటనే ఆంజనేయుడు ”నువ్వు శివుడవు .నేను భద్రుడను .నీకూ నాకు భేదమే లేదు ”అని చెప్పాడు .

22 August, 2012

కీసరవంశము మొదటి ముగ్గురన్నదమ్ములు


వేంకటరామ నరసింహా రావు -- మద్యలోనున్నవారు
జ్వాలానరసింహాశర్మ ------- కుడివైపునున్నవారు
యోగానంద నరసింహశర్మ ---- ఎడమవైపునున్నవారు

         

కీసర వంశము***** KEESARAVAMSAM