25 May, 2011

త్రిరత్నములు

అమ్మ సరస్వతి ప్రసునాంబకు శ్రీనాన్నగారు కీసర వేంకటరామ నరసింహారావుగారు ప్రేమతో ఇచ్చిన త్రిరత్నములు.


త్రిరత్నములు వీక్షించుటకు ఈ లింకు నొక్కండి.

http://www.archive.org/details/TRIRATNALU


లింకునొక్కితే, All Files: HTTP కి వెళ్ళి, ఇండెక్సు లోని, fathersonnets అనే ఫాంట్ కు వెళ్ళి, త్రిరత్నములు వీక్షించవచ్చును. మీ కంప్యూటర్ లోకి సేవ్ చేయవచ్చును.

పితృదేవతల సరసన చేరిన కరుణకుమారి

పితృదేవతల సరసన చేరిన కరుణకుమారి
కీ.శే.భాస్కర నరసింహ శర్మ, మాత జయప్రదల ఎకైక పుత్రిక కరుణ కుమారి ది. 11.04.2011 న ఎర్రుపాలెం లో
స్వర్గస్తురాలైనది అని తెలుపుటకు  చింతిస్తున్నాము. చిన్నన్నయ్య శ్రీ వేదాద్రి నరసింహ శర్మ కరుణకుమారి
 అంత్యక్రియలు (ఖననము) 12.04.2011 జరిపాడు. కీసర వంశస్తులందరూ ఈ ఖననమునకు  హాజరయి మాత జయప్రదకు సంతాపము తెలిపి, స్వాంతన చేకూర్చడానికి ప్రయత్నించారు. 22.04.2011 న ఎర్రుపాలెం లో నారయణబలి జరిగినది.



మేనమామ చి.విజయభాస్కర్, అతని ధర్మపత్ని చి.జయ, మాత జయప్రద కుటుంబమునకు చేయూతనిచ్చిన తీరు ఆదర్శనీయము.

బాబాయిలన్నా, అత్తయ్యలన్నా కరుణకుమారికి ప్రత్యేక అభిమానముండేది. వాళ్ళని సర్వదా స్మరిస్తూండేది. ఈజన్మలో కరుణకుమారి జన్మరాహిత్యము పొందాటానికి మాతా జయప్రద గర్భజనిత అయిందని మా భావన. పితృదేవతల సరసన చేరిన  కరుణకుమారికి ఇవే మా నమోవాకములు. కరుణకుమారిఅనే ఉపాధిలోనున్న జీవుడు శాంతిననుభవించుగాక అని ఆ సర్వాంతర్యామిని  ప్రార్ధిస్తున్నాము.

16 May, 2011

పవిత్ర గంగాపుష్కరములలో పితృకార్యము

పవిత్ర గంగాపుష్కరములలో పితృకార్యము


వైశాఖ శుద్ధ పంచమి నుండి పవిత్ర గంగానదికి పుష్కరములు ప్రారంభమయినవి. సమస్త నదులు అంశామాత్రముగా గంగానదిలో ప్రవేశిస్తాయని హిందూశాస్త్రములు చెపుతున్నాయి. ఈ పవిత్ర సమయములో పితృదేవతలకు పుష్కరమునిచ్చుట అనుచారముగా వస్తున్నది.



ఈ సందర్భము పురస్కరించుకుని, సాయిఅన్నయ్య హరిద్వార్ లో, పవిత్ర గంగానది పుష్కరము ప్రారంభమయిన రోజుననే, అంటే, వైశాఖ శుద్ధ పంచమి రోజునే,

ధర్మపత్ని చి.జగదీశ్వరి, ద్వితీయపుత్రుడు చి.సునీల్ కుమార్,కోడలు చి.స్వప్నసుందరి, ప్రధమ మనుమరాలు చి.సౌందర్యలహరి, ద్వితీయ మనుమరాలు చి. స్వర్ణమంజరి, తోడురాగా , యావత్కార్యక్రమము శ్రీవాసుదేవశర్మగారి యాజ్జ్యవల్క్యములో ద్విగ్విజయముగా పుష్కరము గావించాడు.



ప్రితృదేవతలు కీ.శే. వేంకటరామనరసింహారావు గార్కి, మాతృమూర్తి కీ.శే.సరస్వతీప్రసూనాంబగారితో సహా, మొత్తము 52 మందికి

పిండప్రదానము సహా తర్పణములొసగబడినవి.



ఈ కార్యక్రమము హరిద్వారములో  ఇంత విశేషముగా జరుగుట మా పూరాకృత పుణ్యవిశేషముగా భావిస్తున్నాము.



ఎంతో శ్రద్ధతో, శ్రమతీసుకుని అన్ని ఏర్పాట్లు చేసిన చి.సునీల్ కుమార్, చి.స్వప్నసుందరీ లను ఈ సందర్భముగా

ప్రత్యేకముగా అభినందిస్తూ, ఆశీర్వదిస్తున్నాము. స్వస్తి.



ఈ సందర్భముగా తీసిన ఛాయాచిత్రములు కొన్ని మీ కన్నుల పండుగ చేస్తాయి. ఇవిగో అవి.





కీసర వంశము***** KEESARAVAMSAM